క‌రోనా క‌ల‌క‌లం నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం వెల్లడించిన‌ లాక్ డౌన్ 4.0 నిబంధ‌న‌లు ఓ వైపు... దేశ‌వ్యాప్తంగా మిగ‌తా రాష్ట్రాల‌న్నింటికంటే ముందుగా దీర్ఘ‌కాలిక లాక డౌన్ పొడ‌గింపు ద్వారా తెలంగాణ‌‌ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ‌వ్యాప్తంగా వార్త‌ల్లో నిలిచారు. అయితే, తాజాగా లాక్ డౌన్ 4 విష‌యంలో మార్గ‌ద‌ర్శ‌కాలు నిర్దేశించేందుకు ప్రగతిభవన్‌లో కేసీఆర్  అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జ‌రిగింది. వివిధ అంశాల‌పై స‌మ‌గ్రంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వం  లాక్‌డౌన్‌ నూతన మార్గదర్శకాలను విడుదలపై స‌మ‌గ్రంగా చ‌ర్చించారు. దీంతోపాటుగా కరోనా నేపథ్యంలో ఆర్టీసీ బస్సులకు అనుమతివ్వడం, రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానంలో భాగంగా నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధి విధానాలపైనా చర్చించారు. ప్ర‌ధానంగా లాక్ డౌన్ విష‌యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రివర్గంలో చర్చించారు.

 

 

అనంత‌రం తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ‌లోని కంటైన్మెంట్ జోన్లు మిన‌హా అన్నింటినీ గ్రీన్ జోన్లుగా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కంటైన్మైంట్ జోన్ల‌లోని ప్ర‌జ‌లు సంబంధిత నిబంధ‌న‌ల‌కు స‌హ‌క‌రించాల‌ని కోరారు. జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ బ్ర‌తుకును కొన‌సాగించాల‌ని కోరారు. నిబంధ‌న‌లను అనుస‌రించి వ్యాపారాలు, కార్య‌క‌లాపాలు తెరుచుకోవ‌చ్చున‌ని ప్ర‌క‌టించారు. వారి వారి వ్యాపారాలు కొన‌సాగించ‌వ‌చ్చ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. కీల‌క‌మైన హైద‌రాబాద్ విష‌యానికి వ‌స్తే, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ వాటిని తెరుచుకునే నిబంధ‌న‌లు వెల్ల‌డించ‌నున్నార‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. 

 

ఆర్టీసీ బ‌స్సులు మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచే స‌ర్వీసులు న‌డ‌వ‌నున్న‌ట్లు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఇత‌ర రాష్ట్రాల‌కు బ‌స్సు స‌ర్వీసులు అనుమ‌తించ‌బోవ‌డం లేద‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో కూడా బ‌స్సు స‌ర్వీసుల‌ను నిర్వ‌హించ‌బోవ‌డం లేద‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలిపారు. సెలూన్లూ సైతం ఓపెన్ చేసుకోవ‌చ్చున‌ని వెల్ల‌డించారు. కాగా, క‌ర్ఫ్యూ కొన‌సాగించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.   కేంద్ర ప్ర‌భుత్వం లాక్ డౌన్ నిబంధ‌న‌ల‌ను లాక్ డౌన్ 4.0లో పెద్ద ఎత్తున స‌డ‌లించిన నేప‌థ్యంలో, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: