ఇవే విషయాలపై విశాఖ జనసేన నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన పవన్ అవసరమైతే స్టెరిన్ బాధితులకు అండగా ఉద్యమించేందుకు తాను సిద్ధం అంటూ ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విశాఖ బాధితులకు నష్టపరిహారం కూడా ప్రకటించడమే కాకుండా, అతి తక్కువ సమయంలోనే బాధిత కుటుంబాలకు పరిహారం అందించారు. అలాగే ఎల్జి పాలిమర్స్ కంపెనీని మరోచోటికి తరలించే ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే స్టెరిన్ గ్యాస్ ను తరలించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయినా దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు పవన్ సిద్ధమవుతున్నారు. అయితే ఈ వ్యవహారమంతా పూర్తిగా సద్దు మణిగిపోతుంది అనుకుంటున్న సమయంలో పవన్ దీనిని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలు ఆయనకు ఎంత వరకు కలిసి వస్తుంది అనేది ప్రశ్నగా మారింది.
ఈ వ్యవహారం లో ప్రభుత్వ పాత్ర పెద్దగా లేదు అనేది అక్కడి బాధితులకు తెలుసు. ఇది అనుకోని ఉత్పాతం. అలాగే ఎల్జీ పాలిమర్స్ కంపెనీ 60 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. ఈ కంపెనీ కార్యకలాపాలు విస్తరించుకోవడానికి గత తెలుగుదేశం పార్టీనే అనుమతులు ఇచ్చింది. ఇక ఇప్పుడు ఈ ప్రమాదం జరిగిన తరువాత సహాయక చర్యలు దగ్గర నుంచి పరిహారం, స్టెరిన్ గ్యాస్ తరలింపు వరకు అన్నిటిలోనూ వైసీపీ ప్రభుత్వం వేగంగానే స్పందించింది. కానీ ఇప్పుడు దీనిపై జనసేన తరపున పవన్ ఉద్యమించినా కలిగే ప్రయోజనం మాత్రం అంతంతమాత్రంగానే ఉంటుంది అనే సూచనలు వస్తున్నాయి.