తెలుగు రాష్ట్రాల మధ్య పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు మరోమారు మాటల యుద్ధానికి కారణం అయిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఏపీతో కలిసి ఉన్నాము కలిసే ఉంటాం.. అలా అని రాష్ట్రానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ పై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ ఏపీ తో కలిసి ఉన్నాము కలిసే ఉంటాం. నీటి వాటాలపై ఇరు రాష్ట్రాల సీఎం లకు అవగాహన ఉందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన కేటాయింపుల్ని వాడుకుంటున్నట్లు చెప్పిన సీఎం.. పోతిరెడ్డిపాడు విషయంలో ఆంధ్ర సీఎం లకు సంచులు మోసింది ఎవరు వాళ్ళు కాదా అంటూ ప్రతిపక్షాలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో విపక్షాల తీరును ఆయన తప్పుపట్టారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని అన్నారు. 2005లో కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోతిరెడ్డి పాడు నుంచి 44వేల క్యూసెక్కుల నీరు తీసుకున్నారని గుర్తు చేశారు. ఆ నీటి విషయంపై పీజేఆర్, మర్రి శశిధర్ రెడ్డిలు వైఎస్ ను విభేదిస్తే .. కేసీఆర్ ఒక్కమాట మాట్లాడలేదని విమర్శించారు. పోతిరెడ్డిపాడుపై అన్నిసార్లు స్పందించానన్న కేసీఆర్ మాటల్లో వాస్తవం లేదని అన్నారు. అదే నిజమైతే 11వేల 500 క్యూసెక్కుల గండి కేసీఆర్ ఎందుకు పూడ్చలేదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు ద్వారా అన్యాయం జరుగుతుందని అప్పట్లో తాము పోరాటం చేశామన్నారు. చాలా సార్లు ఇద్దరూ ముఖ్యమంత్రులు ప్రజల సొమ్ము తో కట్టిన ప్రగతి భవన్ లో సమావేశాలు జరిపారని, అప్పుడేందుకు పోతిరెడ్డిపాడు వ్యవహారం పై వారిద్దరి మధ్య చర్చ రాలేదని ఉత్తమ్ ప్రశ్నించారు చర్చలు జరపకపోవడంలో కేసీఆర్ అసమర్థత అనుకోవాలా? లేక జగన్మోహన్ రెడ్డి తో కేసీఆర్ కుమ్మక్కయ్యారని అనుకోవాలా? అని అన్నారు. ఖర్చు లేకుండా వచ్చే కృష్ణ నీటిని కేసీఆర్ ఏపీ కి పంపే ప్లాన్ లో ఉన్నాడని, పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ కి తరలించే నీళ్లు లక్ష కోట్లు కర్చుపెట్టిన కాళేశ్వరం కంటే ఎక్కువా అని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు మొదలైతే కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబం వ్యవహారం కాదని, తెలంగాణ ప్రజల వ్యవహారమని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఖర్చుకు జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ పైసలు ఇచ్చిన తమకు సంబంధం లేదని, తెలంగాణకు అన్యాయం జరుగుతుందనేది తమ ఆందోళన అని అన్నారు.
కాగా,