ఇప్పుడు ప్రపంచంలో చాలమంది అమ్మయ్య లాక్‌డౌన్ తీసేసారు.. ఇక మనకు స్వేచ్చ వచ్చినట్లే అనే భ్రమలో ఉన్నారు.. అదీగాక కరోనా వైరస్ వ్యాపిస్తున్న సమయంలో కొందరైతే కరోనా లేదు కాకరకాయ లేదు.. అది నన్నేం చేయదు అంటు రొమ్ము విరుచుకు తిరిగారు.. అయితే కరోనా బలాన్ని తక్కువగా అంచనా వేసిన దేశాలే ఇప్పుడు దిక్కుతోచని స్దితిలో భయం గుప్పుట్లో బ్రతుకుతున్నాయి.. ఎవరైతే ఈ వ్యాధిని తేలికగా తీసుకున్నారో వారందరు తగిన మూల్యాన్నే చెల్లిస్తున్నారు..

 

 

అయితే ఒక మొండి మనిషి ఇలాగే కరోనా అంటే అసలు లెక్కచేయలేదు.. పైగా అది కేవలం ప్రభుత్వం ఆడుతున్న నాటకమని ప్రచారం చేశారు.. కానీ అతన్ని పీడిస్తే గానీ బుద్ధి రాలేదు.. వివరాలు చూస్తే.. ఫ్లోరిడాలోని జుపిటర్ టౌన్‌కు చెందిన బ్రైన్ హిచెన్స్ అనే వ్యక్తి కరోనాను లైట్‌గా తీసుకుని, కనీసం మాస్క్ కూడా పెట్టుకోకుండా ఊరంత తిరిగాడు.. ఇలా ఎన్నిరోజులని అతని ఆటలు సాగుతాయి చెప్పండి.. అదను చూసి కరోనా అతని మీద దూకేసింది.. దాని ఫలితం ఐదు వారాల క్రితం బ్రైన్, అతడి భార్య అనారోగ్యానికి గురయ్యారు.

 

 

విషయం ఏంటో అని తెలుసుకోవడానికి ఆసుపత్రిలో పరీక్షలు చేయగా.. ఇద్దరికి కరోనా సోకినట్టు తేలింది.. అయితే కరోనా అంటించుకున్న బ్రైన్ త్వరగానే కోలుకున్నాడు.. కానీ అతని భార్య మాత్రం వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతోంది. ఇలాంటి పరిస్దితుల్లో ఆమె బతకడం కష్టమని డాక్టర్లు కూడా అంటున్నారట.. ఇక తనకు, తన భార్యకు కరోనా సోకితే కాని బ్రైన్‌కు వాస్తవ పరిస్థితి అర్థం కాలేదు.

 

 

తాను ఎంతో పెద్ద తప్పు చేశానని.. మాస్క్ పెట్టుకుని భౌతిక దూరం పాటిస్తూ వచ్చి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదని బ్రైన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కనీసం తన భార్యను చూసేందుకు అనుమతి కూడా లేకుండా పోయిందని కన్నీటి పర్యంతమయ్యాడు. చూశారా కరోనానే కదా అని తేలికగా తీసుకోకండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: