ఆడవాళ్ళు మగవాళ్ళు మించిన రేంజులో  పరాయి పురుషుడితో శృంగారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి..ఈ మధ్య మరి ఎక్కువగా జరుగుతున్నాయి.. లాక్ డౌన్ ఒకవైపు కఠినతరంగా కొనసాగుతున్న కూడా అసాంఘిక కార్యకలాపాలు ఎన్నో జరుగుతూ వస్తున్నాయి.. ఈ మేరకు చాలా మంది వావి వరుసలు మరచి మరి  రెచ్చిపోతున్నారు.. ఓ అత్త తన మేనల్లుడు తో రాసలీలలు సాగించింది.. దీంతో ఆమెకు ఒక బాబు పుట్టాడు.. 

 

 

వివరాల్లోకి వెళితే..వివాహేతర సంబంధం నేపథ్యంలో జంట ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన వెలుగుచూసింది. మేనల్లుడితో ఆ సంబంధం పెట్టుకున్న మహిళ ఏకంగా కొడుకునే కనేసింది. ఆ విషయం భర్తకి తెలిసి వేధింపులకు గురిచేస్తుండడంతో ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రియుడి చెంతకు చేరింది. అద్దెకు ఇల్లు తీసుకుని ఉంటుండగా భర్త అక్కడికి కూడా వచ్చి గొడవచేయడంతో ఇద్దరూ ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటుచేసుకుంది.

 

 

 


నగరంలోని బిర్లా నగర్ ప్రాంతానికి చెందిన హరిసింగ్ జాతవ్, సునీత(27) భార్యాభర్తలు. వారికి ఏడాదిన్నర వయసున్న కొడుకు ఉన్నాడు. సునీతకి బులాకి ప్రాంతంలో ఉంటున్న ఆమె మేనల్లుడు రాము జాతవ్(26)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్తకి తెలియకుండా ఆరేళ్లుగా అతనితో రాసలీలలు సాగిస్తోంది. రహస్యంగా కలుసుకుని ఎంజాయ్ చేసేవారు. ఫలితంగా ఒక బిడ్డకి జన్మనిచ్చింది.

 

 

 


పిల్లాడు తనకు పుట్టలేదని తెలుసుకున్న భర్త శారీరకంగా మానసికంగా హింసిస్తూ వస్తున్నాడు.. దాంతో ఆమె పిల్లాడితో సహా పారిపోయి అల్లుడు చెంతకు చేరింది..ఆమెకి కావాలసిన సరుకులు అన్నీ తెచ్చిస్తో రూం కు అద్దె కడుతూ చూసుకున్నాడు..ఆ విషయం తెలుసుకున్న ఆమె భర్త అక్కడికి వెళ్లి ఇంటికి వచ్చేయాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో భర్త హరిసింగ్ పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో ఆగ్రహం చెందిన సునీత కత్తితో గొంతులో పొడుచుకుంది. అది చూసిన ఆమె ప్రియుడు రాము జాతవ్ పొట్టలో కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే ఇద్దరినీ చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు...

మరింత సమాచారం తెలుసుకోండి: