ప్రపంచం అంతా కరోనా వైరస్ తో అల్లకల్లోలం అవుతుంది.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ మాయదారి కరోనా భూతం ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. అయితే కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి చైనాలో లాక్ డౌన్ విధిస్తూ కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టే ప్రయత్నం చేశారు. చైనా బాటలోనే పలు దేశాలు లాక్ డౌన్ పాటిస్తూ కొంతలో కొంత కరోనా కట్టడి చేయగలిగారు.  అయితే కరోనా కల్లోల ప్రపంచంలో లాక్‌డౌన్ ఏమాత్రం అమలు చేయని దేశం స్వీడన్‌. కరోనా వైరస్ గురించి ఇక్కడి ప్రజలకు చెబుతూ తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేలా జాగ్రత్తగా వ్యవహరిస్తే సరిపోతుంది. లాక్‌డౌన్ అమలు చేయాల్సిన అవసరం లేదు అని స్వీడన్ ఒంటెత్తు పోకడలో పోయింది. కానీ ఇప్పుడు ఇదే ఈ దేశానికి పెను ముప్పుగా మారబోతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

 

మొన్నటిదాకా పరిస్థితి అదుపులోనే ఉన్నట్టు కనిపించింది. కానీ మే 13 నుంచి 20వ తేదీ మధ్యన గల వారంరోజుల్లో తలసరి మరణాల రేటు బ్రిటన్, ఇటలీ, బెల్జియంను మించిపోయింది.  ప్రపంచంలో కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగా అమెరికాలో ఉంది.. ఇక్కడ దాదాపు లక్షకు చేరువలో మరణాలు సంబవించాయి. ఆ తర్వాత  బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా దేశాలు ఎక్కువ జననష్టాన్ని పొందాయి. కాగా యూకే, బెల్జియం, యూఎస్ మరణాల రేట్లు 5.57, 4.28, 4.11గా నమోదయ్యాయి.   ప్రభుత్వ అంటువ్యాధుల సలహాదారు ఆండర్స్ టెగ్‌నెల్ ఈ నిర్ణయానికి మూలకారకుడని అంటున్నారు.  

 

పాఠశాలలకు కూడా సెలవులు ఇవ్వలేదు. వ్యాపార కేంద్రాలు, పరిశ్రమలు మామూలుగా పనిచేశాయి. ప్రజాజీవనం యథాతథంగా కొనసాగింది. స్వీడన్‌లో రెస్టారెంట్లు, బార్లు మామూలుగా తెరిచే ఉంచారు.  దాంతో జనసంచారం ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే.  స్వీడన్ తో పోల్చి చూపుతున్న దేశాల మొత్తం మరణాలు చాలాచాలా ఎక్కువగా ఉన్న సంగతి గుర్తించాలని ఆయన అంటున్నారు. అయితే వారం రోజుల మరణాల రేటు గురించి మాట్లాడడం అర్థరహితమని టెగ్‌నెల్ కొట్టిపారేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: