ఈ మధ్యకాలంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడంలేదు. దీంతో సృష్టికి మూలం అని చెప్పుకునే మహిళకు ప్రస్తుతం రక్షణ లేకుండా పోయింది. ప్రస్తుతం మహిళలందరూ ప్రశ్నార్థక జీవితాన్ని గడుపుతున్నారు. ఆడపిల్లగా పుట్టడమే మా తప్ప అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. అయితే కేవలం బయట తిరిగే ఆకతాయిల నుంచి మాత్రమే కాదు. సొంత వారి నుంచి కూడా ప్రస్తుతం రక్షణ కరువవుతుంది. నా అనుకున్న వాళ్లు కామంతో కళ్లు మూసుకుపోయిన మీద పడి పశువాంఛ తీర్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనలతో సభ్యసమాజం తలదించుకుంటుంది . తాజాగా ఇలాంటి ఓ దారుణ ఘటన జరిగింది. 

 


 ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రి... కామంతో కళ్లు మూసుకుపోయి రాక్షసుడు గా మారిపోయాడు. తన అరచేతిలో పెట్టుకుని పెంచి అల్లారుముద్దుగా చూసుకున్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక ఈ విషయం చివరికి పోలీసుల వరకు వెళ్లడంతో కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... పెదవేగి మండలం కి చెందిన  దంపతులకు ఓ కుమార్తె ఉంది. అయితే 14 ఏళ్ల కుమార్తె పై కామం పెంచుకున్నాడు తండ్రి . ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూతురు ని బెదిరించి కూతురిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 

 


 ఈ విషయం తల్లి తో చెబితే చంపేస్తాను అంటూ బెదిరించాడు ఆ కామాంధుడు. ఇక రోజురోజుకు తండ్రి వికృత చేష్టలు పెరిగిపోతూనే ఉన్నాయి. కానీ తన తండ్రి తనను ఏం చేస్తాడో  అనే భయంతో బయటకి చెప్పలేదు. ఈ క్రమంలోనే ఈ నెల 16వ తేదీన తన ఇంటి నుంచి బయటకు వచ్చి  ఏలూరు వైపు వస్తుండగా ఓ అపరిచిత వ్యక్తి న్యాయం చేస్తానని చెప్పి ఏలూరులో ఓ గదిలో ఉంచారు. ఇక అంతే కాకుండా సదరు గుర్తు తెలియని వ్యక్తి కూడా తన గదిలో ఉంచి అత్యాచారం చేయబోయాడు అంటూ బాలిక తల్లికి చెప్పడంతో... పోలీసులు దిశ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి విచారిస్తున్నారు.  అయితే ఈ క్రమంలోనే తనపైకి ఎక్కడ కేసు వస్తుందనే భయంతో తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: