వరంగల్ జిల్లాలో బావిలో మృతదేహాలు బయట పడుతుండడం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మొదటిరోజు బావిలో మూడు మృతదేహాలు బయటపడగా.... ప్రస్తుతం ఆ మృతదేహాల సంఖ్య పెరిగి పోతూనే ఉంది. ఒక్కో మృతదేహం క్రమక్రమంగా బయటపడుతుంది. ఈ ఘటనతో పాటు స్థానికులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అసలు ఏం జరిగి ఉంటుంది అనేది మాత్రం ఎవరికీ అంతుపట్టని విధంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామం బావిలో మృతదేహాలు బయటపడటం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. 

 


 నిన్న ఒకే కుటుంబానికి చెందిన నాలుగు మృతదేహాలు ఈ బావిలో బయటపడడం కలకలం సృష్టించింది. ఏదో సమస్యతో కుటుంబ సభ్యులందరూ ఆత్మహత్య చేసుకొని ఉంటారు అని మొదట అందరూ భావించారు. కానీ ఈ రోజు ఉదయం నుంచి గంటకు ఒక మృతదేహం బయటపడుతూ వస్తోంది. ఇప్పటికే ఉదయం నుంచి ఏకంగా మూడు మృతదేహాలు ఈ బావిలో బయటపడ్డాయి. కాగా ఇప్పటి వరకు మొత్తం ఈ బావి నుంచి బయటపడిన మృతదేహాల సంఖ్య ఏడుకు చేరుతుంది. అయితే మరిన్ని మృతదేహాలు బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా మరో మృతదేహం కూడా బయటపడింది ఈ బావిలో. 

 


 దీంతో ఈ బావిలో ఇంకా ఎన్నో మృతదేహాలు ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొద్ది సమయంలోనే ఒక్కో మృతదేహం బయట పడుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఆ బావి వద్దకు పోలీసులు భారీగా మోహరించారు. కాగా ఈ బావి నుంచి బయటపడ్డ మృతదేహాలు పశ్చిమ బెంగాల్కు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. ఇక వీరిలో ఒక బాలుడు కూడా ఉన్నాడు అని తెలిపారు. అయితే ఇంత మంది మృతదేహాలు బయటపడ్డ నేపథ్యంలో సరికొత్త అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. ముందుగా ఈ కుటుంబం ఏదో సమస్యతో ఆత్మహత్య చేసుకుంది అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ మృతదేహాలు బావి నుంచి బయట పడుతున్న నేపథ్యంలో... ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ బావి నుంచి మరెన్ని  మృతదేహాలు బయటపడతాయో  అన్నది ప్రస్తుతం సంచలనంగా  మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: