తన తల్లి చేసిన తప్పుకి రెండేళ్ల చిన్నారి పాప బలి కావాల్సి వచ్చింది. తనకు ఒకసారి పెళ్లి అయ్యి ఒక కూతురు ఉందన్న విషయాన్ని దాచి పెట్టి ఓ మహిళ వేరే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. అయితే నిజం ఎన్ని రోజులు దాచుకుంటుంది చెప్పండి. కొద్దిరోజులకే రెండో భర్తకు ఆమె విషయం మొత్తం తెలిసిపోవడంతో గొడవ పడ్డారు. ఈ గొడవల కారణంగా మధ్యలో రెండేళ్ల చిన్నారి పాప ప్రాణాలు కోల్పోయింది.

 


ఇక అసలు విషయంలోకి వెళితే.... తమిళనాడు రాష్ట్రంలోని తిరుపుత్తూరు సమీపంలో పాచ్చల్‌ గ్రామానికి చెందిన శివ శక్తి అనే వ్యక్తి లారీ డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నాడు. ఈయనకు 2017 సంవత్సరంలో వేలూరు దగ్గర ప్రాంతంలోని ఒక యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇరువురికి కూతురు పుట్టింది. అయితే కొన్ని కుటుంబ కలహాల కారణంగా ఆమె మాత్రం తన పుట్టింటికి కూతురితో కలిసి చేరుకుంది.

 

 

ఇలా వచ్చిన ఆమె కె.వి కుప్పంలోని దేవరిషి కుప్పానికి చెందిన ప్రవీణ్ కుమార్ అనే ఒక వ్యక్తిని ఇష్టపడి తన జీవితంలో రెండో పెళ్లి చేసుకుంది. అయితే రెండు రోజుల క్రితం ఆమె తన కూతురుకు అనారోగ్యంగా ఉందని దగ్గరలోని ఆసుపత్రికి ఆ పాపను తీసుకుని వెళ్ళింది. అయితే అక్కడ పాప కోలుకోలేక మృతి చెందింది. ఆ మృతదేహాన్ని మొదటి భర్త శివ శక్తి కి అప్పగించింది. దీనితో ఆగ్రహించిన మొదటి భర్త కూతురు ఎలా చనిపోయింది అని అడగగా పొంతన లేని సమాధానాలు అతనికి చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన అతడు పోలీసులకు ఫిర్యాదు అందించాడు. అయితే పోలీసులు ఆ చిన్నారి మృత దేహాన్ని ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు హత్యకు గురైనట్లు అక్కడ తెలిసింది.

 

 

ఇక దీనితో పోలీసులు ఆ బాలిక తల్లి, ప్రవీణ్ కుమార్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు నిమిత్తం పోలీసు అధికారులు వారిని విచారణ చేస్తున్నారు. ఇందులో మొదటి భర్త కుమార్తె గురించి చెప్పకుండా ఆవిడ తనను రెండో వివాహం చేసుకుందని ప్రవీణ్ కుమార్ తెలిపాడు. చిన్నారిని తన ఇంటికి తీసుకు రావడంతో విషయం తెలియడంతో భార్యతో గొడవ పడ్డాడని, ఇక ఆ క్రమంలోనే ఆవేశంతో పాపను నేలకేసి కొట్టడంతో చనిపోయిందని పోలీసులకు ప్రవీణ్ కుమార్ తెలిపాడు. ఇక దీనితో వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: