ప్రస్తుతం ఉపాధి పని లేకుండా వలస కార్మికులు, కూలీలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారిని చూసి జాలి పడకుండా.. ఒక కాంట్రాక్టర్ కూలి భార్యపై అత్యాచారానికి పాల్పడటం జరిగింది. ఈ దారుణమైన సంఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది. ఆ కుటుంబం పడుతున్న ఇబ్బందులను అడ్డుగా పెట్టుకొని వలస కూలి భార్యను లొంగదీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇక విషయం సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే... సిలిగురి జిల్లా ఈస్ట్ ఫుల్ వారి పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రామానికి చెందిన ముజ్జిర్ రెహమాన్ మార్బుల్ కాంట్రాక్టర్. ఇక తన వద్ద మార్బుల్ కూలీగా పని చేసుకుంటూ ఉన్న ఒక వ్యక్తి భార్య పై కన్ను వేయడం జరిగింది. 


ఇక లాక్ డౌన్ సమయంలో ఆ కూలీ కుటుంబం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే ఇదే ఆసరాగా చేసుకుని.. సాయం పేరుతో ఒక వ్యక్తి భార్యను లొంగదీసుకునేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. మీకు తినడానికి బియ్యం ఇస్తాను అని ఇంట్లోకి పిలిచి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. కాంట్రాక్టర్ అలా చెప్పడంతో రెండు కేజీల బియ్యం తెచ్చుకునేందుకు వెళ్ళిన ఆమెను కాంట్రాక్టర్ రేప్ చేసేందుకు ప్రయత్నించడంతో ఆమె భయపడి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. అసలు విషయం ఆమె భర్తతో చెప్పి పోలీసులకు సంప్రదించారు. 


రెహమాన్ తనపై అత్యాచార ప్రయత్నం చేశాడు అంటూ పోలీస్ స్టేషన్ లో వారిద్దరూ ఫిర్యాదు చేయడం జరిగింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు అధికారులు కేసు నమోదు చేసుకొని విచారణ మొదలుపెట్టారు. బియ్యం కోసం వెళ్లిన ఆ యువతికి రెహమాన్ తన న్యూడ్ వీడియోలు చూపించి తన కోరికలు తీర్చాలని కోరాడు... అది గతంలోనే తీసినట్లు ఉందని కూడా పోలీస్ అధికారులకు ఆమె తెలియజేసింది. ఒకవేళ రెహమాన్ దీనికి అంగీకరించకపోతే సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు అని ఆమె పోలీస్ అధికారులకు తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: