చంద్రబాబుకు ఎన్నో పేర్లు, పార్టీ అభిమానులు పెట్టే పేర్లు బిరుదులు అనుకుంటే ప్రత్యర్దులు  పెట్టిన పేర్లు మరకలు. వెన్నుపోటు బాబు అంటారు రాజకీయ ప్రత్యర్ధులు. ఆయన సొంత మామ ఎన్టీయార్ కి వెన్నుపోటు పొడిచారని ప్రతీ ఎక్కడో ఒక చోట ప్రత్యర్ధులు చెబుతూనే ఉంటారు. ఇక ఎన్టీయార్ రెండ్వ భార్య‌ లక్ష్మీ పార్వతి ఉంది. ఆమె చంద్రబాబు తన భర్తకు జరిగిన  అన్యాయం గురించి  ఎపుడూ తల‌చుకుంటూనే ఉంటుంది.

 

ఇక ఆమె ఇపుడు వైసీపీలో ఉన్నారు. తెలుగు అకాడమీ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె తాజాగా చంద్రబాబువి చెత్త రాజకీయాలు అంటూ ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. బాబు రాజకీయానికి విశాఖ డాక్టర్ సుధాకర్ తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు, అలాగే 66 ఏళ్ళ వ్రుద్ధురాలు  రంగనాయకి కూడా టీడీపీ రాజకీయంలో బలిపశువు అయ్యారని లక్ష్మీ పార్వతి అంటున్నారు. ఎన్నికల్లో ఓడిన తరువాత చంద్రబాబు డర్టీ  పాలిటిక్స్ కి తెరతీశారని అంటున్నారు.

 

ఇక తన భర్త ఎన్టీయార్ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచి అధికారం నుంచి దించేసి ఈ ఏడాదికి పాతికేళ్ళు అయిందని లక్ష్మీ పార్వతి గుర్తుచేస్తున్నారు. ఈ ఏడాది గుర్తుంచుకోతగినది అని కూడా అమె అంటున్నారు. పాతికేళ్ళు గడచినా ప్రజలు మాత్రం బాబు వెన్నుపోటుని ఎప్పటికీ మరచిపోలేదని కూడా లక్ష్మీ పార్వతి చెబుతున్నారు.

 

ఇక ఏపీలో ఏడాది క్రితం టీడీపీ పునాదులు మొత్తం కుదిపేసి, కదిపేసి అధికారంలోకి వచ్చిన జగన్ ఏడాదిలో ఎన్నో హామీలను నెరవేచి ప్రజల గుండెల్లో నిలిచారని, ఆయన ప్రజలకు చేస్తున్న సేవతో ఏపీ జనం సంత్రుప్తిగా ఉన్నారని అంటున్నారు. అందువల్ల నాయుడు సేవలు ఈ ప్రజలకు అవసరం లేదని వారు పూర్తిగా మరచిపోఅయారని కూడా బాబు అత్తగారు అంటున్నారు.

 

చంద్రబాబు ఇపుడు జనంలో లేడని జూమ్ బాబు గా మిగిలిపోయాడని, ఆయన రాజకీయ జీవితం కూడా ముగిసిందని ఆమె జోస్యం చెప్పేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: