చంద్రబాబుకు ఉన్న తెలివి జగన్‌కు లేదు అని వైసీపీలో నెంబర్ టూ స్థాయిలో పలుకుబడి ఉన్న ఎంపీ విజయసాయి రెడ్డి ఒప్పేసుకున్నారు. ఒప్పుకున్నారు అంటే నిజంగా అంగీకరించినట్టు కాదండోయ్.. అదో సెటైర్ అన్నమాట.. పొగుడుతూనే తిట్టడం లాంటింది.

ఇటీవల చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చుని చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ విజయసాయిరెడ్డి ఇలా వెరైటీగా స్పందించారన్నమాట.

 

 

ఇంతకీ చంద్రబాబు ఏమన్నారంటే.. కరెంటు గురించి సీఎం జగన్ కు అస్సలు అవగాహన లేదట. ఈ వ్యాఖ్యలు సహజంగానే విజయసాయిరెడ్డి వంటి వారికి ఆగ్రహం తెప్పిస్తాయి. అయితే దాన్ని విజయసాయి రెడ్డి సెటైర్ గా తిప్పికొట్టారు. అవును.. నిజమే.. జగన్‌కు కరెంట్ గురించి అస్సలు అవగాహన లేదు.. లక్ష కోట్ల ప్రజాధనాన్ని ప్రైవేటు విద్యుత్తు సంస్థలకు దోచిపెట్టడానికి ఒప్పందాలు చేసుకున్నారే, ఆ స్థాయి మేధస్సు నిజంగానే జగన్ గారికి లేదు.. అంటూ విరుచుకుపడ్డారు.

 

 

అందుకే జగన్.. ప్రజలకు భారంగా మారిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని అంటున్నాడు. ఇసుక నుంచి తైలం తీసే మీతెలివి ఆయనకెక్కడిది.. మరి అంటూ చంద్రబాబును పరోక్షంగా ఓ రేంజ్‌లో గాలి తీసేశారు. అంతే కాదు.. అదే సమయంలో గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వేసవిలో పది డిగ్రీలు ఉష్ణోగ్రతలు తగ్గించాలని చేసిన కామెంట్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు విజయసాయిరెడ్డి.

 

 

అప్పుడెప్పుడో స్విట్జర్లాండ్ మంత్రి పాస్కల్ కూషెపిన్ బాబు లాగా కోతలు కోస్తే తమ దేశంలో మెంటల్ హాస్పిటల్‌కు పంపిస్తారని గాలి తీశాడు. అయినా మీరు కొంచెం కూడా మారలేదు. రాష్ట్రంలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించాలని అప్పట్లో అధికారులను ఆదేశించడం పిచ్చి కాకపోతే మరేంటి? అని విజయసాయి అన్నారు. అంతే కాదు.. గతంలో తమిళనాడు సీఎం జయలలిత కుమార్తెనని ఎవరో అమ్మాయి కోర్టుకెక్కడం, హీరో ధనుష్ తమ కుమారుడే అని ఇంకొకాయన హంగామా చేయడం చూశాం. పోతిరెడ్డిపాడు కట్టింది తనే అని చంద్రబాబు సిగ్గులేకుండా క్లెయిం చేసుకోవడం కూడా అలాంటి సంచలనమే. ఆయన హయాంలో తట్ట మట్టి కూడా తీయలేదని విజయసాయి మండిపడ్డారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: