ఈ మధ్యకాలంలో బంధాలకు బంధుత్వాలకు విలువ లేకుండా పోతుంది. చిన్నచిన్న కారణాలకే గొడవలు తలెత్తడం... తర్వాత ఆ గొడవలు  ప్రాణాలు తీసేంతవరకూ వెళ్ళడం అలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయనిపించింది. సొంత వారు అని కూడా చూడకుండా ఏకంగా మానవత్వం మరిచి అతి దారుణంగా హత్యలు చేస్తున్నారు. సాటి మనుషులు అన్న జాలి కూడా చూపించడం లేదు. ఇలాంటి ఘటనలు ఈ రోజుల్లో ఎక్కువైపోతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి తెరమీదికి వచ్చింది. బావ బావమరిది మధ్య జరిగిన చిన్న వివాదం ఏకంగా ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్ళింది. ఇక దీనికి కారణం తెలిసిన పోలీసులు షాకవ్వాల్సిందే పరిస్థితి ఏర్పడింది. ప్రకాశం జిల్లాలో జరిగింది ఈ దారుణ ఘటన. 

 

 వివరాల్లోకి వెళితే... పెద్దారవీడు మండలం చెంచుగిరిజన కాలనీకి చెందిన మండ్ల  రాజయ్య కుడుములు చెన్నయ్య బావ బావమరుదులు. రాజయ్య తన బావమరిది చెన్నయ్య దగ్గర కొద్ది రోజుల క్రితమే అవసరం ఉండటంతో రెండు వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఇక రాజయ్య ఎంతకీ మళ్లీ ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో చెన్నయ్య డబ్బులు చెల్లించాలి అంటూ భావ రాజయ్య  పై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టాడు. ఎన్ని సార్లు చెప్పినప్పటికీ రాజయ్య  మాత్రం డబ్బులు చెల్లించకపోవడంతో చెన్నయ్య బావ రాజయ్య  పై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య శుక్రవారం గొడవ తలెత్తింది. దీంతో మాటా మాటా పెరిగింది... ఈ నేపథ్యంలో కోపంతో ఊగిపోయిన బావమరిది చెన్నయ్య... తన దగ్గర ఉన్న బాణం వేయడంతో రాజయ్య శరీరంలో ఆ బాణం బలంగా దిగింది  దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి  ప్రాణాలు వదిలాడు రాజయ్య . 

 

 దీంతో భయంతో ఊగిపోయిన చెన్నయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో... హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇక స్థానికులు పోలీసులకు జరిగిన విషయాన్ని వివరించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కేవలం రెండు వేల కోసం  ఏకంగా హత్య చేయడం తో అటు  పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఇక ఈ ఘటన స్థానికంగా అందరినీ తీవ్ర భయాందోళనకు గురి చేసింది. కాగా ప్రస్తుతం పరారీలో ఉన్న బావమరిది చెన్నయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: