అతికిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు ఓ యువకుడు. లైంగికంగా తన కోరిక తీర్చలేదనే కోపంతోనే హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హతురాలి చిన్నాన్న కోడుకే ఈ పనికి పాల్పడటంతో స్థానికంగా అందరూ షాక్‌కి గురయ్యారు. ఈ దారుణ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకొట మండలం రామనాథపురం గురువారం జరిగింది. స్థానికంగా ఉంటోన్న పసుపుల వడ్డేకొండన్న, కొండమ్మ దంపతుల రెండో కుమార్తె లక్ష్మీ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రులకు పొలం పనుల్లో సాయపడేది. గురువారం ఉదయం అన్నలు పోలం పనులకు వెళ్లగా వారికి భోజనం తీసుకువెళ్లేందుకు ఆమె బయలుదేరింది. ఈ విషయం గమనించిన చిన్నాన్న కొడుకు శేఖర్ ఆమె వెనుకే వెళ్లాడు. రెండు నిమిషాల్లో పొలానికి చేరుతారనగా.. వెనుక నుంచి శేఖర్ గొడ్డలితో దాడి చేశాడు. అక్కడికక్కడే ఆమె ప్రాణాలు విడిచింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. తమ కూమార్తెను శేఖరే చంపాడని గత కొంతకాలంగా అతను లైంగికంగా వేధించేవాడని, అందుకు నిరాకరించడంతో ఇలా చేశాడని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. సంఘటనా స్థలంలో నిందితుడు వదిలేసిన గొడ్డలి ఆధారంగా అతడిని పోలీసు జాగిలాల సహాయంతో పట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: