టిక్ టాక్ ఒక యూత్‌నే కాదు.. దాదాపు అందరికి దీని దురదను అంటించిందని చెప్పవచ్చూ.. తిండితినకుండా అయినా ఉంటారు కావచ్చూ కానీ టిక్ టాక్ చేయకుండా ఒక్క రోజు ఉండరు ఇంతలా బానిసలను చేసింది టిక్ టాక్ అనే పిచ్చి.. దీనివల్ల కాపురాలు కూలుతున్న, ఉద్యోగాలు ఊడుతున్న, ప్రమాదాలు జరుగుతున్న ఎవరికి కించిత్తు కూడా భయం కలగడం లేదు.. జరిగేదేదో జరగక తప్పదు.. కానీ నేను మాత్రం టిక్ టాక్ చేయడం ఆపనంటు మెంటల్‌గా ఫిక్సయినట్లు ఉన్నారు.. ఇక అప్పుడప్పుడు ఈ టిక్ టాక్ లు పోలీస్ స్టేషన్ మెట్లుకూడా ఎక్కిస్తుంది.. ఇదిగో ఇలాంటి పనికి మాలిన పని చేసిన ఒక యువతి చివరికి జైలుకు కూడా వెళ్లింది..

 

 

ఇకపోతే టిక్ టాక్ లోకంలో కరోనా వైరస్‌తో పోటీపడుతూ చేస్తున్న విధ్యంసాన్ని నివారించడానికి మనదేశంలో నుండి ఈ యాప్ ను బ్యాన్ చేయాలనీ  వందలాది మంది నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో.. టిక్ టాక్ పై చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. అయినా ఈ టిక్ టాక్ ప్రవాహం ఆగడం లేదు.. తాజాగా కూడా ఓ యువతీ టిక్ టాక్ చేసి జైలు పాలు అయ్యింది. ఆ వివరాలు చూస్తే.. అహ్మదాబాద్‌లో ఒక అమ్మాయి టిక్‌టాక్ పిచ్చి బాగా ముదిరి అధిక లైకుల సాధించడం కోసం రోడ్డుపై ఓ వీడియో చేసింది.

 

 

ఆ వీడియో మరీ వినూత్నంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయి రాత్రి 9 గంటలకు లాక్‌డౌన్‌ నిబందనలను ఉల్లంఘించి, నడి రోడ్డుపై దొర్లుతూ టిక్‌టాక్‌ వీడియోలు చేయడమే కాకుండా, తనకున్న నోటి దురద వల్ల లాక్‌డౌన్‌ ఎత్తేయాలని మోడీని అడుగుతున్నట్లుగా పూర్తి వ్యంగ్యంగా వీడియో కూడా చేసిందట. ఇంకేముంది ఈ వీడియో కాస్తా పోలీసుల దృష్టికి వెళ్ళడంతో అమ్మాయిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.. పిచ్చిముదిరితే మెంటల్ హస్పిటల్‌కు పంపిస్తారు.. టిక్ టాక్ పిచ్చి ముదిరితే ఇలా పోలీస్ స్టేషన్లకు పంపిస్తున్నారు కానీ దీనికి పూర్తిగా నివారణ చర్యలు చేపడితే బాగుండునని నెటిజన్స్ అంటున్నారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: