లోకంలో ఏ జంతువులు ప్రవర్తించని విధంగా మనుషులు ప్రవర్తిస్తున్నారు అనడానికి నిత్యం జరుగుతున్న సంఘటనలు ఎన్నో ఉదహరించవచ్చూ.. ఒకడేమో కన్న తల్లి స్నానం చేస్తుంటే వీడియో తీస్తాడు, మరొకడేమో సొంత సొదరిమణుల పైనే కామాన్ని పెంచుకుంటాడు, ఇంకొకడు కన్న కూతుళ్లపైనే కన్నేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నాడు.. ఇలా ఆడ మగ అనే తేడా లేకుండా.. కామంతో, కసితో, పగద్వేషాలతో రగిలిపోతున్నారు..

 

 

ఇలా ఇంకా కంటికి కనిపించని, చెవులకు వినిపించని దారుణమైన నేరాలు ఎన్ని జరుగుతున్నాయో, ఇలాంటివి ఎన్ని వెలుగులోకి రాకుండా చీకట్లో కలిసిపోతున్నాయో లెక్కేలేదు.. చెప్పేటివి శ్రీరంగ నీతులు, చేసే పనులు మాత్రం చెండాలపు పనులు.. మనుషుల్లో మానవత్వం పూర్తిగా నశిస్తుంది.. ఇక ఎన్ని నీతులు చెప్పిన చెవికి ఎక్కవు.. ఇకపోతే పరిస్దితులు ఎలాంటివో తెలియదు కానీ కన్న బిడ్ద కళ్లు తెరవకుండానే ఒక కసాయి తల్లి ఆ పసిపాపను చెత్తబుట్టలో పడేసింది. ఈ ఘటన నగరంలో జరిగింది..

 

 

నగరంలోని ఫీవర్ ఆస్పత్రి ఓపీ వార్డులోని ఒక మహిళ ప్రసవం అనంతరం డస్ట్ బిన్ లో అప్పుడే పుట్టిన పాపను పడేసి దొంగలా పారిపోయిందట. అయితే.. వార్డును క్లీన్ చేస్తున్న సిబ్బంది చెత్త బుట్టలో పాప ఉన్నట్లు గుర్తించి అధికారులకు సమాచారం అందించగా, వెంటనే పాపను వైద్య పరీక్షల కోసం నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ డస్ట్ బిన్ లో పాపను ఎవరు పడేశారో తెలుసుకునేందుకు ఆస్పత్రిలోని సీసీ ఫూటేజ్ పరిశీలించగా, సుమారుగా ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో బుర్ఖా ధరించిన ఓ మహిళ పాపను వదలివెళ్లినట్లు గమనించారట.

 

 

ఇకపోతే అక్రమ సంబంధం వల్ల ఇలా చేసిందా, లేక ఆర్ధిక ఇబ్బందుల వల్ల చేశారా లేదా మరేదైన కారణంతో ఇంతనటి నీచానికి పాల్పడ్డారా అనే కోణంతో పాటుగా, ఈ పని చేసిన ఆ మహిళ ఎవరో గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారట.. ఏది ఏమైనా చేయని తప్పుకు ఆ పసిది శిక్ష అనుభవించడం మాత్రం చాలా బాధాకరం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: