రోజురోజుకీ దేశంలో కరోనా వైరస్ కేసులతో పాటు అఘాయిత్యాలు కేసులు కూడా పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ సడలింపు ఇచ్చిన తర్వాత వీటి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ వెళుతుంది. హత్యలు, ఆత్మహత్యలు, మానభంగాలు ఇలా క్రైమ్ రేటు రోజురోజుకీ పెరుగుతూ వెళుతుంది. అయితే ఇక అసలు విషయంలోకి వెళితే... భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక సంఘటన జరిగింది. అందులో ఓ కామాంధుడు వేధింపులు భరించలేక మరో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. తాను బాత్రూంలో స్నానం చేస్తుండగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసేందుకు సదరు మహిళ మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది.

 


ఇక ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే... భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని కరవాగు గేట్ తండాకు చెందిన కొల్లూరి రాజేశ్వరి అనే వివాహిత స్నానం చేస్తుండగా అదే తండాకు చెందిన బానోత్ మధు అనే యువకుడు వీడియోని తీశాడు. అయితే ఇక ఆ వీడియోని చూపిస్తూ ఆమె పై కొన్ని రోజుల నుంచి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు సదరు వ్యక్తి. ఇలా చేయడంతో మనస్తాపానికి గురైన రాజేశ్వరి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

 

ఇది గమనించిన కుటుంబ సభ్యులు కొత్తగూడెం ఏరియా హాస్పిటల్ కి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆవిడ ప్రాణాలు వదిలింది. దీనితో మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. నిజంగా ఇలాంటి వారికి ఎన్ని నిర్భయ లాంటి చట్టాలను తీసుకు వచ్చిన సరిపోవు. వారిని కఠినంగా శిక్షిస్తే తప్పించి అటువంటి వారికి బుద్ధి రాదు. ప్రభుత్వం తరఫున ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇలాంటి దుర్మార్గులు మాత్రం వారి వక్ర బుద్ధిని వదలడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: