ప్రస్తుత రోజుల్లో ఎవరిని నమ్మాలో లేదో అన్నది అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. సొంత వారే మోసం చేసే రోజులు ఇవి. ఇక స్నేహితులు అయితే మరీ దారుణంగా తయారయ్యారు. చిన్న గొడవ అయితే ఏకంగా వారిలో వారే కొట్టుకొని చివరకు చంపేస్తాయికి దిగజారారు. ఇలాంటి ఘటనే తాజాగా తెలంగాణలో చోటుచేసుకుంది. తోటి స్నేహితులే ఒక వ్యాపారిని అతి దారుణంగా చంపేసి చెట్ల పొదలలో పడేసారు. ఇక ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళితే... సిద్దిపేట జిల్లా తొగుట మండలం చందాపూర్ కు చెందిన ఉదయ్ కుమార్ రెడ్డి ని తన స్నేహితులే కత్తితో దాడి చేసి కారుతో ఢీ కొట్టి ముళ్లపొదల్లోకి పడేయడం జరిగింది. 


ఇక ఉదయ్ కుమార్ హైదరాబాదులో జీవనం కొనసాగిస్తూ ఒక విత్తన కంపెనీలో పని చేసుకుంటూ మరోవైపు సొంతంగా వ్యాపారం కొనసాగిస్తున్నాడు. ఇక ఇటీవలే తాను కొంగరకలాన్ నుంచి ఉదయం కారులో మిత్రుడితో కలిసి ఆలేరు మండలం కొలనుపాక వద్దకు వద్ద స్నేహితులతో కలిసి చేర్యాలకు మధ్యాహ్నం రావడం జరిగింది. హైవే పై వెళ్తూ లెనిన్ నగర్ దాటిన తర్వాత ఒక చెట్టు కింద కూర్చుని ముగ్గురు మద్యం తాగారు. ఈ తరుణంలోనే ముగ్గురి మధ్య ఒక చిన్న గొడవ రావడం జరిగింది. ఇద్దరు మిత్రులు కలిసి ఉదయ్ కుమార్ ని కత్తులతో అతి కిరాతకంగా పొడి చేశారు. అయినా కూడా గాయాలపాలతో ఉదయ్ కుమార్ పరిగెత్తుతూ ఉండడంతో కారుతో ఢీ కొట్టేసారు.


ఉదయ్ కుమార్ చనిపోయాడు అని నిర్ధారించుకున్న తరువాత మృతదేహాన్ని పక్కనే ఉన్న పొదల్లోకి ఉదయ్ కుమార్ ని పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. మధ్యాహ్నం12 గంటల తర్వాత ఉదయ్ కుమార్ సెల్ ఫోన్ స్విచాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. ఇక మరి కొద్ది సేపటికే ఉదయ్ కుమార్ హత్యకు గురయ్యాడు అన్న విషయం తెలిసి కుటుంబ సభ్యులు అంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఘటన విషయం తెలుసుకున్న పోలీస్ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: