మనిషి ఆలోచనలు మామూలుగానే కౄరమృగాన్ని తలపిస్తాయి. అందులో మద్యం తాగిన వారిని ఎప్పుడు నమ్మకూడదు.. అతనితో ఎంత మంచి రిలేషన్ ఉన్నా కూడా ఆ సమయంలో అతనిలో ఎక్కడలేని ఆలోచనలు పుట్టుకొచ్చి ఏం చేస్తాడో, ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు.. ఇకపోతే కొందరు తాగితే వారికి బంధాలు, బాంధవ్యాలు ఏవి గుర్తుకు రావు.. బండరాళ్లకంటే కఠినంగా మారిపోతారు.. బాధ్యతలను విస్మరించి ఎంతటి ఘాతుకానికైనా ఒడికడతారు.. ఇకపోతే ఒక వ్యక్తి తాగిన మైకంలో అతని భార్యకు తెలియకుండా కన్నబిడ్దనే కసాయిలా అమ్మేసాడు.. ఇక తాగితే మనిషి నిజాలు మాట్లాడతాడు అంటారు కానీ, ఆ తాగడం కోసం మనిషి మృగంలా తయారవుతున్నాడు. తాజాగా హైదరాబాద్‌‌లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.

 

 

హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారం బతుకమ్మ బండ బస్తీకి చెందిన సింగ్, సరిత భార్యాభర్తలు. సింగ్ పచ్చి తాగుబోతు. కాగా లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా మళ్ళీ మద్యం షాపులు తెరిచిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో అతని తాగుడు ఇంకా ఎక్కువైంది. అసలే పనీపాటలు లేవు, రోజు తాగడానికి డబ్బులు ఉండాలంటే చాల కష్టం. అందుకని తన నెలన్నర చిన్నారిని.. లాల్ సాబ్ గూడకు చెందిన శేషుకు రూ.22 వేలకు విక్రయించాడు. ఈ కిరాతకం తన భార్యకు తెలియకుండా రాత్రి 11 గంటలకు  శిశువును తీసుకెళ్లి అప్పగించాడు. అదికూడా ఒక బ్యాగులో  చిన్నారిని వేసుకుని.. ఇక తెలవారంగా ఆ చిన్నారి కోసం తల్లి సరిత ఎంత వెతికిన కనిపించక పోయే సరికి, భర్తను ప్రశ్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

 

 

ఈ విషయాన్ని ఆ మహిళ స్థానికులకు తెలుపగా వారు, పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారట. రంగంలోకి దిగిన పోలీసులు శేషును అదుపులోకి తీసుకుని, ఆ చిన్నారిని తల్లి సరితకు అప్పగించారు. ఇకపోతే చిన్నారి తండ్రి సింగ్‌తో పాటు శేషును పోలీసులు విచారిస్తున్నారు. చూశారా లోకం ఎంత కసాయిగా మారుతుంది.. అందుకే నీడను కూడా ఈ రోజుల్లో నమ్మడానికి వీలులేదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: