వడ్డీ కాసుల వాడు... భక్తులు కోరిన కోరికలు తీర్చే భగవంతుడు... ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకి కాదు దేశవ్యాప్తంగా ఎంతో మంది భక్తులకు కష్టాల్లో ధైర్యం ఇచ్చే  దేవుడు ప్రస్తుతం కష్టాల్లో  పడ్డ విషయం తెలిసిందే . ఏకంగా  వడ్డీ కాసుల వాడి సంబంధించిన ఆస్తులను వేలం వేసేందుకు ప్రస్తుతం రంగం సిద్ధమైంది. టీటీడీ ఆస్తుల వేలం జరుగుతుండడం ప్రస్తుతం సంచలనంగా  మారిపోయిన విషయం తెలిసిందే. టిటిడి ఆస్తుల అమ్మకం పై ప్రతిపక్ష ల తో పాటు ఎంతో మంది ప్రముఖులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల కష్టాలను తీర్చే ఆ దేవుడికే కష్టం వచ్చిందా.. ఎందుకు టీటీడీ కి సంబంధించిన ఆస్తులను అమ్ముతున్నారు... అంటూ ఎంతో మంది ప్రశ్నిస్తున్నారు. 

 

 అటు ప్రతిపక్ష టిడిపి పార్టీ అయితే అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. దేవుడి  ఆస్తులు అమ్మాల్సిన దుస్థితి ఏర్పడింద అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. అయితే తాజాగా ఇదే విషయపై సినీ నటుడు మంచు మనోజ్ కూడా స్పందిస్తూ ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా మంచు మనోజ్ ఒక పోస్టు పెట్టగా ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఓం నమో వెంకటేశాయ... అంటూ ఓ లేఖని  రాసిన మంచు మనోజ్ ఎన్నో విషయాలను అందులో ప్రస్తావించాడు. టీటీడీ ఆస్తులు అమ్మమని దేవుడేమైనా  మీకు చెప్పాడా..? కరోనా  సంక్షోభంలో రోజుకు లక్ష మందికి ఆకలి తీర్చమని దేవుడు ఏమైనా మీకు చెప్పాడా..? చేసేది చెప్పేది అంత దేవుడు కాదు టీటీడీ పాలకమండలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తులను కొండెక్కి వచ్చిన లక్షలాది మంది భక్తులను... సుప్రభాత సమయమైంది నిద్రలేవాలి అంటూ శ్రీవారిని సైతం కంట్రోల్ చేసేది టీటీడీ పాలకమండలి మాత్రమే. 

 


 అయితే కొండ పైన ఉన్న వడ్డీ కాసుల వాడి ఆస్తులు సైతం అమ్మకానికి వచ్చే పరిస్థితి వచ్చింది అంటే.. గోవింద గోవింద అని అరిచిన ఈ  గొంతు కొంచెం తడబడింది. మోసం జరగలేదు అని తెలుసు.. ఎందుకంటే ఇన్సైడర్  ట్రేడింగ్ లాగా కాకుండా వేలం వేసి అందరి ముందు అందరికీ తెలిసేలా అందరూ చూస్తుండగానే ఆస్తుల అమ్మకం జరుపుతున్నారు. కానీ ఎందుకు అమ్ముతున్నారు..? అని పాలకమండలిని కాస్త వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అంటూ మంచు  మనోజ్ లేఖలో తెలిపాడు. వివరణ మాత్రమే... ఏమీ లేదు సార్... ఇంత పెద్ద కొండ ఇన్ని రోజుల వరకు మాకు అండగా ఉంది అని చూస్తూ మురిసిపోయే తిరుపతి వాడినే కాబట్టే ఆపుకోలేక అడుగుతున్నాను.. అంతకుమించి ఏమీ లేదు.. అంటు మంచు మనోజ్ పోస్ట్ పెట్టగా...  అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: