దేశం మొత్తం కరోనాతో కష్టాలు పడుతుంటే.. కొంత మంది కామంధులు మాత్రం తమ ఇష్టానుసారం అత్యలు, అత్యాచారాలు.. లైంగిక దాడులకు తెగబడున్నారు.  కరోనాతో మనిషిని మనిషి తాకాలంటే భయపడే ఈ సమయంలో కామంధులు మాత్రం రెచ్చిపోతున్నారు.  ఒకటి కాదు రెండు కాదు ఈ రెండు నెలల కాలంలోనే పలు రాష్ట్రాల్లో మహిళలపై అత్యాచారాలు జరిగాయి.  దారుణమైన విషయం ఏంటంటే ఈ మద్య ఉచ్చనీచాలు మరిచి చిన్న పిల్లలపై అత్యాచారలకు తెగబడుతున్నారు కామాంధులు.  చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళలపై అత్యాచారాలకు తెగబడున్నారు.  నిర్భయ, దిశ కేసులు చూసినా వీరీ తీరు మాత్రం ఏమీ మారడం లేదు.  లాక్ డౌన్ సమయంలో పలు అత్యాచార కేసులు నమోదు అయ్యాయి అంటున్నారు పోలీసులు.

 

ఇతర క్రైమ్ రేటు తగ్గినా అత్యాచార కేసులు మాత్రం నమోదు అవుతున్నాయని అంటున్నారు. మరీ దారుణమైన విషయం ఏంటంటే క్వారంటైన్ లోఉంటున్న మహిళలపై కూడా కొంత మంది కామాంధులు అత్యాచారాలు చేస్తున్నారు.  తాజాగా విశాఖపట్నం జిల్లాలో పదేండ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఎరుకు నాయుడు అనే 60 ఏండ్ల వృద్ధుడిని అనకాపల్లి దిశా పోలీస్‌స్టేషన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మే నెల 23న విశాఖపట్నం జిల్లా కసింకోట మండలం, నరసపురం గ్రామంలో ఎరుకు నాయుడు అనే వృద్ధుడు తమ పొరుగునే ఉండే పదేండ్ల బాలికకు మాయమాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.  

 

ఇది ఆ మద్య పెద్ద సెన్సేషన్ అయ్యింది.. ఆ వృద్దుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు ఫైర్ అయ్యారు. బాలిక ద్వారా విషయం తెలుసుకున్న ఆమె తల్లి అదే రోజు రాత్రి (మే 23) అనకాపల్లిలోని దిశా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలించి సోమవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు ప్రకటించిన అనకాపల్లి దిశా పోలీస్‌ స్టేసన్ డీఎస్పీ కుమారస్వామి.. తదుపరి విచారణ కొనసాగుతుందని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: