కొందరు ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో తొందరపడి వారి ప్రాణాలు తీసుకుంటారు. ఇలాంటి సంఘటనలు ఎక్కువగా భార్య భర్తల విషయంలో, లేకపోతే ప్రేమికుల మధ్యన ఎక్కువగా వస్తుంటాయి. ఇప్పుడు ఇలాంటి సంఘటనే ఒకటి తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో జరిగింది. ప్రేమించిన అమ్మాయి తనకు దక్కకపోవచ్చు అన్న ఆలోచనతో ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడి మరణించడం జరిగింది. ఇక ఈ విషయం పూర్తి వివరాల్లోకి వెళితే...

IHG


నారాయణపేట జిల్లాలోని లింగంపల్లి పంచాయతీకి చెందిన తిరుమలేష్ అదే గ్రామానికి చెందిన ఒక అమ్మాయిని ప్రేమించాడు. వీరిద్దరూ గత కొన్ని రోజులుగా కలిసి తిరుగుతున్నారు. ఇదే నేపథ్యంలో తిరుమలేష్ ధన్వాడ మండలంలోని పాతపల్లి కి చెందిన గొర్రెలను మేపడానికి పనిలో చేరి ఖమ్మం జిల్లాకు వలస వెళ్ళాడు.

IHG

 

ఇక ఇది ఇలా ఉండగా అతడు ప్రియురాలికి వారం రోజుల క్రితమే వేరే అబ్బాయితో పెళ్ళి నిశ్చయించారు పెద్దలు. ఆ తర్వాత ఈ విషయాన్ని తెలుసుకున్న తిరుమలేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. చివరకు తన ప్రేమించిన ప్రియురాలిని పెళ్లి చేసుకోవడం కుదరదు ఏమో అని ఆందోళనతో శనివారం నాడు ఖమ్మం జిల్లాలోని పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు.

IHG


దీనితో స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా, అక్కడ ఆయన చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఇలా చేసుకోవడం ఇప్పుడు ఉన్న జనరేషన్ కు ఎంతవరకు కరెక్టో వారికే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: