దేశంలో ఇప్పుడు కరోనా వైరస్ వల్ల ఎంతో మంది కష్టాలు.. కన్నీళ్లలో మునిగి ఉన్నారు. అయితే కొంత మంది దుర్మార్గులు మాత్రం కామంతో కళ్లు మూసుకుపోయి ఆడవారు కనిపిస్తే చాలు చిత్తకార్తె కుక్కల్లా రెచ్చిపోతున్నారు. గత మూడు నెలల క్రితం దేశ వ్యాప్తంగా ఎన్నో కేసులు నమోదు అయ్యాయి. కాకపోతే కరోనా వైరస్ భయంతో ఇలాంటి దారుణాలకు పాల్పపడరని భావించారు. కానీ కామంతో నా పరాయి అనే తేడా లేకుండా అత్యాచారాలకు పాల్పపడుతున్న నీచుల కేసులు ఒక్కొక్కటిగా నమోదు అవుతున్నాయి. తాజాగా కామంతో కండ్లు మూసుకుపోయి పలువురిపై లైంగికదాడికి దిగిన ఓ కామపిశాచి దారుణహత్యకు గురయ్యాడు. అయితే అతని చూపు కన్న కూతురు పై పడటంతో అది సహించని ఆ కుటుంబ సభ్యులు కడతేర్చారు.
పంజాబ్ జిల్లా లుథియానాకు సమీపంలోని సందర్నగర్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్యం సేవించి ఇంటికి వచ్చిన 40 ఏండ్ల వ్యక్తి.. కూతురిపై లైంగికదాడి చేసేందుకు ప్రయత్నించాడు. అది చూసిన పాప తల్లి, సోదరుడు తండ్రిని ఆపే ప్రయత్నం చేశారు. దాంతో ఆ దుర్మార్గుడు తన పనికి అడ్డు వస్తే కేబుల్ వైర్ తో ఆత్మహత్య చేసుకుంటానని భపెట్టాడు. అతని కృరమైన చర్యలకు కొంత కాలంగా బాధపడుతున్న తల్లి,తనయుడు, కూతురు ఇదే అదును అని కేబుల్ వైర్తో ఉరిబిగించి చంపేశారు.
స్థానికులు దసేరీ పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు తల్లితోపాటు కుమారుడు, కుమార్తెను అదుపులోకి తీసుకొన్నారు. ఇక మద్యం మత్తులో కామంతో కళ్లు మూసుకుపోయి ఉన్న సదరు పెద్దమనిషి.. సవతి కూతురిపై 2014లో లైంగికదాడికి పాల్పడ్డాడు. దాంతో ఆర్నెళ్లు జైలుకు వెళ్లి బెయిల్ పై వచ్చాడు. మరో ఘటనలో భార్య సోదరిపై కూడా లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. సదరు వ్యక్తి నిందితురాలిని రెండో వివాహం చేసుకోగా వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మొదటి భర్తతో నిందితురాలికి కుమార్తె, కుమారుడు ఉన్నారు.