భారతదేశంలో ఎక్కువగా భారతదేశం గురించి గొప్పగా చెప్పే వారి కంటే... చెడుగా చెప్పే మీడియా సంస్థలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. భారత దేశంలో ఉంటూ భారత దేశపు తిండి తింటూ ఏకంగా భారత దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి పలు మీడియా సంస్థలు. ఇలాంటి వాటిలో ఒకటి ఎన్డి టీవీ . ప్రస్తుతం భారత్ కి ఎప్పుడూ విరుద్దంగా వ్యవరిస్తుంది ఎన్డి టీవీ . తాజాగా మరోసారి  తన  వ్యవహారశైలిని బయటపెట్టింది. మొన్నటికి మొన్న చైనా భారత్ సరిహద్దులో సైనికుల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. చైనా పాక్ సరిహద్దుల్లో  అటు చైనా సైనికులు భారత సైనికులు నో  మ్యాన్ జోన్ లోకి రావడంతో ఇరు దేశాల సైనికుల మధ్య తోపులాట ఆ తర్వాత గొడవకు దారి తీసింది. 

 


 దీంతో ఒకరిపై ఒకరు ఏకంగా పిడిగుద్దులు కూడా కురిపించారు. ఈ క్రమంలోనే భారత సైనికులు ముగ్గురు గాయపడగా చైనా కు సంబంధించిన సైనికులు ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటనలు ఏకంగా చైనా సైన్యం లెఫ్టినెంట్ పై కూడా భారత సైనికులు చేసుకున్నారు అనేది ఒక వాదన. ఇది అప్పట్లో సంచలనంగా మారింది పలు విమర్శలు కూడా వచ్చాయి.  ప్రస్తుతం ఇది సద్దుమణిగింది కూడా. అయితే తాజాగా ఈ ఘటనకు సంబంధించి ఎన్డి టీవీ  భారత సైన్యాన్ని అవమానించేలా ఒక కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం దీనిపై భారత ప్రజానీకం మొత్తం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 

 


 ఎలాంటి పరిస్థితుల్లోనైనా వీడియో సంస్థలు భారత సైన్యాన్ని సమర్పించాల్సి ఉంటుంది. కానీ తాజాగా ఈ మీడియా సంస్థ మాత్రం భారత్ లో ఉంటూ భారత తిండి తింటూ భారత సైన్యాన్ని కించపరిచేలా మాట్లాడింది. అదేంటంటే భారత సైనికులను చైనా సైనికులు నిర్బంధించారని... ఇక ఆ తర్వాత వారికి క్షమాభిక్ష పెట్టి ప్రాణాలతో వదిలేశారు అంటూ ఒక కథనాన్ని ప్రచురించింది. దీనిపై అటు  విశ్లేషకులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అసలేం జరిగింది అన్న విషయాన్ని భారత ఆర్మీ ని కనుక్కో కుండా ఇలాంటి కథనాలు ప్రచురితం చేయడం నిజంగా సిగ్గుచేటు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: