సమాజంలో పూర్తిగా భయం అంటే తెలియనట్లుగా ప్రవర్తిస్తున్నారు కామాంధులు.. ఇప్పటికే షాద్‌నగర్‌ సమీపంలో దిశపై జరిగిన అత్యాచా ఘటనలో నిందితులను ఎన్‌కౌంటర్ కూడా చేశారు. అయినా కూడా మృగాళ్లలో మార్పు రావడం లేదు. కరోనా లాక్‌డౌన్ నేపధ్యంలో క్రైం రేటు కొంత తగ్గినా, లాక్‌డౌన్ సడలించాక మళ్లీ యధాతదంగా కామాంధులు రెచ్చిపోతున్నారు.. వరంగల్‌లో 9 మందిని చంపిన విషయం మరవక ముందే తాజాగా ఓ స్టాఫ్ నర్సుపై సామూహిక అత్యాచారం జరిగింది. ఇదంత ఆడదాని పొందుకోసమే జరుగుతున్న నేరాలు.. నిందితులను ఎంత కఠినంగా శిక్షిస్తున్న రోజు రోజుకు ఇలాంటి నేరాలు పెరుగుతున్నాయో గానీ తగ్గడం లేదు..

 

 

ఇకపోతే ప్రేమ పేరిట ఓ యువకుడు తన ప్రియురాలిని నమ్మించి ఏకాంత ప్రదేశానికి తీసుకు వెళ్లి బలవంతంగా మత్తు మందు ఇచ్చి తన స్నేహితులతో కలిసి కీచక పర్వాన్ని విజయవంతంగా ముగించాడు.. ఇక స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న ప్రియురాలికి ఫోన్ చేసిన ప్రియుడు భాను ఏకాంతంగా కలవాలని కోరగా, అతన్ని నమ్మి వచ్చిన ప్రియురాలిని ఎలికట్ట సమీపంలోని ఐరన్ ఫ్యాక్టరీ వెనుక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. అంతటితో ఆగని దుర్మార్గుడు తన స్నేహితుల కోరిక తీర్చాలని ఒత్తిడి చేయగా, ఆ ప్రియుడి నీచకోరికను ఆమె తిరస్కరించిగా ఆమెకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇవ్వగా, ఆ యువతి మత్తులోకి జారుకున్నాక ప్రియుడి ఇద్దరు స్నేహితులు ఆమెపై పడి తమ పశువాంఛ తీర్చుకున్నారు.

 

 

కొంత సేపటి తర్వాత మెలకువ రాగా తనపై సాగుతున్న అరాచకాన్ని పసిగట్టి ప్రతిఘటించడంతో ఆ యువతి పై తీవ్రంగా దాడి చేశారు. అయితే ఆ బాధితురాలు ఎలాగో వారి నుంచి తప్పించుకుని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో వారు షాద్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు. ఇక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.. కానీ ఇంతగా జరుగుతున్న అమ్మాయిలు అబ్బాయిలను నమ్మడం మాత్రం ఆగడం లేదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: