ఆధునిక నియంత‌ల్లో ఒక‌రు అయిన ఉత్త‌ర కొరియా అధినేత కిమ్ జాంగ్ చ‌రిత్ర గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. కిమ్ నియంతృత్వాల గురించి ఎంత త‌క్కువ చెప్పుకుంటే అంత మంచిది.. త‌వ్విన కొద్ది కిమ్ నేర ప్ర‌వృత్తి.. నియంత‌గా అత‌డు చేసిన దారుణాలు.. దుర‌ఘతాలు వెలుగులోకి వ‌స్తూనే ఉంటాయి. కిమ్ నియంతృత్వం గురించి జ‌గ మెరిగిన స‌త్యాలే. కిమ్ త‌ప్పుల‌కు ఎలాంటి శిక్ష‌లు వేస్తారో విన‌డానికే భ‌యంక‌రంగా ఉంటాయి. తాజాగా కిమ్ క్రూర‌త్వం మ‌రోసారి బ‌య‌ట ప‌డింది. ఓ కొడుకును త‌న తండ్రి ద‌గ్గ‌ర‌కు చేర్చాల‌ని చూసిన ఓ జంట‌ను నిర్దాక్షిణ్యంగా చిత్ర హింస‌లు పెట్టించి మ‌రీ చంపించేశారు.

 

ఈ సంఘ‌ట‌న పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఉత్త‌ర కొరియాలోని ర్యాంగాంగ్ ప్రావిన్స్‌కు చెందిన 50 ఏళ్ల భార్యాభర్తలు ఇటీవల దేశ సరిహద్దులు దాటి చైనా పారిపోవాలని అనుకున్నారు. అయితే దీని వెన‌క స‌ద‌రు భార్య‌ సోద‌రుడు కొడుకు ( 14) ను స‌రిహ‌ద్దులు దాటించి ద‌క్షిణ కొరియాకు చేర్చాల‌నుకోవ‌డ‌మే ఆ దంప‌తులు చేసిన పాపం. త‌న అన్న స‌రిహ‌ద్దులు దాటి ద‌క్షిణ కొరియాకు వెళ్లిపోయాడు. దీంతో త‌న సోద‌రుడి కొడుకును త‌న సోద‌రుడి ద‌గ్గ‌ర‌గే చేర్చాల‌ని భావించిన ఆ భార్య‌తో పాటు ఆమె భ‌ర్త‌ నిర్ణ‌యించుకున్నారు.

 

ఈ క్ర‌మంలోనే అన్ని సిద్ధం చేసుకుని ఎవ్వ‌రి కంట ప‌డ‌కుండా సోద‌రుడి ద‌గ్గ‌ర‌కు వెళ్లేందుకు చైనా స‌రిహ‌ద్దుకు చేరుకున్నారు. అయితే అక్క‌డే ఉన్న బోర్డ‌ర్ సెక్యూరిటీ వాళ్ల‌ను మాటు వేసి ప‌ట్టుకున్నారు. వాళ్ల‌ను ప‌ట్టుకున్న‌ సైన్యం ఆ జంటను చిత్రహింసలకు గురి చేసి నిజం ఒప్పుకునేలా చేశారు. అయితే త‌మ మేన‌ళ్లుడు కోరిక మేర‌కు అత‌డిని తాము తండ్రి ద‌గ్గ‌ర‌కు తీసుకు వెళ్లేందుకు ఈ ప‌ని చేశామ‌ని చెప్పినా విన‌లేదు. కిమ్ సిఫార్సుతో ఆ ఇద్దరినీ ఫైరింగ్ స్క్వాడ్ ఉరి తీసి చంపేశారు. బాలుడు మైనర్ కావడంతో అతడిని లేబర్ క్యాంపుకు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: