ప్రస్తుత కాలంలో ఒక భార్యతో జీవితం కొనసాగించడానికి భర్తలు నానా అవస్థలు పడుతుంటే, ఈయన మాత్రం ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయితే ఇందులో మొదటి భార్య చనిపోగా మిగతా ముగ్గురు భార్యలతో సంసారం కొనసాగిస్తున్నారు. అది కూడా వారిని వేరే వేరే ఊరిలో పెట్టి సంసారాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక ఇలా కొనసాగుతుండగా ఒక రోజు మద్యం మత్తులో చేసిన పొరపాటు ఆయన జీవితాన్నే మార్చేసింది. ఆయన చేసిన పొరపాటు ఏమిటంటే... ఒక భార్య ఇంటికి మరో భార్యతో వెళ్లడమే. దీనితో ఆయన ఏకంగా లోకాన్ని విడిచి పెట్టాల్సిన సమయం వచ్చింది. అయితే ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్సింగ్ పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.

 

ఇక అసలు విషయంలోకి వెళితే... హేమ్ రాజ్ అనే వ్యక్తికి నలుగురు భార్యలు. మొదటి భార్య అనారోగ్యంతో చనిపోగా మిగిలిన ముగ్గురు భార్యలతో ఆయన జీవితం కొనసాగిస్తున్నారు. అయితే ఆ ముగ్గురు ఒకే చోట లేరు. వేరువేరు గ్రామాల్లో ఉంటూ నివసించే వారు. రెండో భార్య నర్సింగ్ పూర్ లో ఉండగా, మూడో భార్య బగస్ పూర్ గ్రామంలో, నాలుగో భార్య కరేలి లో జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. అయితే వీరు ముగ్గురు దగ్గరికి భర్త ఆయనకు నచ్చిన సమయంలో వెళ్లి వచ్చేవాడు. 

 

బాగా మద్యం అలవాటు ఉన్న హేమ్ రాజ్ ఆయన మన ఒక రోజు మద్యం మత్తులో నాలుగో భార్యను తీసుకొని మూడో భార్య దగ్గరికి వెళ్ళాడు. ఇక అంతే తన సవతిని ఇంటికి తీసుకు వచ్చినందుకు తన మూడవ భార్య తీవ్ర కోపంతో అతనిపై గొడవకు దిగింది. అది చిలికిచిలికి పెద్ద గాలివానలా మారి హేమ్ రాజ్ మూడో భార్య పై చేయి చేసుకున్నాడు. దీనితో గొడవ పడిన ఆమె దగ్గర్లోని తమ బంధువుల ఇంటికి వెళ్లి ఆ రోజు నిద్ర పోయింది. అయితే ఆ మరుసటి రోజు తెల్లవారుజామున వచ్చి చూడగానే భర్త ఉరికి వేలాడుతూ కనిపించాడు ఆమెకు. అయితే ఆయన ఇంట్లోనే ఉండి ఉరి వేసుకోవడం ఆత్మహత్య లేకపోతే ఎవరైనా కావాలని చేశారా అని అనుమానం ఆమెకు ఏర్పడింది. దీనితో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి పూర్తి వివరాలు సేకరించారు. మూడో భార్య ఉదయం వచ్చే సరికి ఉరికి వేలాడుతూ కనిపించాడు అని, అంతేకాక ఇంట్లో ఎవరూ కనిపించలేదు అని చెప్పడంతో అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి పోలీసులు విచారణ మొదలు పెట్టారు. అంతేకాకుండా నాలుగో భార్య కనిపించడం లేదని మూడో భార్య పోలీసులకు తెలిపింది. ఇక ముందర అసలు ఏమి జరిగింది అన్న విషయం పోలీసు విచారణలో తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: