బైకును వెనక నుంచి కారు ఢీకొట్టడంతో భార్యాభర్తలు అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు అక్కడికక్కడే మరణించారు. ఒక శుభకార్యం కోసం బయలుదేరి మార్గం మధ్యలోనే ఆ దంపతులు తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం కొత్తపేట కు చెందిన ఆనంద్ హైదరాబాదులో ఒక వలస మేస్త్రీగా పని చేస్తున్నారు. 

IHG

 

వికారాబాద్ జిల్లాలోని పూడూరు లో తన మేనకోడలు నిశ్చితార్థానికి హాజరయ్యేందుకు తన భార్యతో కలిసి హైదరాబాద్ నుంచి బైక్ పై బయలుదేరాడు. మరికొద్ది సేపట్లో తను చేరాల్సిన చోటికి వెళ్ళనుండగా దారి మధ్యలోనే మృత్యువు వారిని వెంటాడింది. వెనుక వైపు వేగంగా వస్తున్న ఒక కారు ఆనంద్ దంపతుల బైకును వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. దీనితో వారు రోడ్డు మీదే ఎగిరి పడ్డారు. దీనితో వారు రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర గాయాలు అయ్యి రక్తస్రావం ఎక్కువ కావడంతో అక్కడికక్కడే మరణించారు.

 

IHG

 

శుభకార్యం కోసమని బయలుదేరిన దంపతులు ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో వారి కుటుంబం మొత్తం తీవ్రంగా విలపించింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారి మృతదేహాలను పరిశీలించి ఆపై ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. వీరి మరణ వార్త విన్న నాగర్ కర్నూలు జిల్లా కొత్తపల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇక ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: