తొమ్మిది నెలలు మోసి కన్న బిడ్డని అమ్మేందుకు సిద్ధమైంది ఒక తల్లి. బిడ్డ పుట్టిన 5 రోజులు గడవక ముందే 5 వేల రూపాయల కోసం బేరం పెట్టేసింది. అందుకోసం ఆసుపత్రి సిబ్బంది తోనే డీల్ మాట్లాడుకోవడం గమనార్హం. ఇక బిడ్డను కొనుక్కోవడానికి ఆస్పత్రికి వచ్చిన అక్క తమ్ముళ్లకు ఐదు రోజుల మగబిడ్డను అమ్మేందుకు బేరం కుదిరింది. అయితే ఈ వ్యవహారం మొత్తం బయటికి తెలియడంతో తీవ్ర కలకలం రేపింది.

IHG


ఇకపోతే ఈ దారుణ సంఘటన కర్ణాటక రాష్ట్రములోని దావనగిరి ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... ధావనిగిరి ప్రాంతంలోని సోనాలి ప్రాంతంలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఈనెల 20న ఒక బిడ్డకు జన్మనిచ్చింది ఓ మహిళ. డబ్బు కోసం ఆశపడి నవమాసాలు మోసి కన్న బిడ్డనే అమ్మేందుకు సిద్ధమయింది ఆ మహాతల్లి. మగ బిడ్డ పుట్టి 5 రోజులు గడవక ముందే 5 వేల రూపాయల కోసం అమ్మేసింది. ఈ విషయంలో ఇక ఏకంగా బయటి వారు కాకుండా ఆసుపత్రి సిబ్బంది బేరం కుదర్చడం చాలా కలకలం రేపింది.


ఇక మధ్య వర్తులతో బిడ్డను విక్రయించడం జరిగింది. అయితే ఈ విషయం బయటకు తెలియడంతో చైల్డ్ డెవలప్మెంట్ అధికారులు రంగంలోకి రావడం జరిగింది. ఇలా ప్రాజెక్ట్ ఆఫీసర్ మహాన్ తేజ్ పూజ అందించిన ఫిర్యాదు మేరకు వివరాలు సేకరించి పోలీస్ అధికారులు ఆరుగురు వ్యక్తుల పై కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే బిడ్డతల్లి పై కూడా కేసు నమోదు చేశారు. ఇందులో ఇప్పటి వరకు నలుగురిని పోలీస్ అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ కేసు నిమిత్తం అటు పోలీసులు, ఇటు హాస్పిటల్ స్టాఫ్ ఇద్దరు దోషులను గుర్తించి శిక్షించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: