ప్రస్తుతం కరోనా వైరస్ దేశాన్ని  మొత్తం కబళిస్తున్న విషయం తెలిసిందే. మానవ జీవనశైలిని అతలాకుతలం చేస్తోంది ఈ మహమ్మారి వైరస్. భారతదేశంలో మొదలు తక్కువ సంఖ్యలోనే కేసులు నమోదు అయినప్పటికీ ప్రస్తుతం మాత్రం రోజురోజుకూ ఈ మహమ్మారి వైరస్ కేసులు  పెరిగిపోతున్నాయి. కాగా ఇప్పుడు వరకు దేశంలో  ఒకటిన్నర లక్ష కి పైగా కేసులు నమోదు కావటం  ఆందోళనకర పరిస్థితులకు దారి తీస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని  ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ మహమ్మారి వైరస్  వ్యాప్తి చెందుతూనే ఉంది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు అయితే ఏకంగా దేశానికి శాపం గా మారి ఆందోళనకర పరిస్థితులకు దారి తీస్తున్నాయి . 

 

 ఇక ఈ మహమ్మారి వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశ ప్రజానీకం తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. అయితే ఈ మహమ్మారి వైరస్ మొదట భారతదేశంలోకి వ్యాప్తి చెందే సమయం లో అక్కడక్కడ పూజారులు పూజలు కూడా నిర్వహించారు. భారత దేశం నుంచి వైరస్ ను  తరిమి కొట్టాలని  దేవునికి ప్రార్థనలు కూడా చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేకాకుండా పలు చోట్ల  మహమ్మారి వైరస్ కు సంబంధించి మూఢనమ్మకాలు నమ్ముతున్నారు ఎక్కువమంది ప్రజలు. ఇక ప్రజలు నమ్ముతున్న మూఢనమ్మకాలు ఎన్నో అనర్థాలకు కూడా దారితీస్తున్నాయి.  

 


 అయితే తాజాగా ఈ మూఢ అమ్మకాల నెపంతో దారుణ ఘటన జరిగింది. కరోనా  పోవాలి అంటూ ఏకంగా నరబలి ఇచ్చిన ఘటన ఒడిశా వెలుగులోకి వచ్చింది.కటక్  జిల్లా నర్సింగ్ పూర్ లో బ్రాహ్మణి దేవి ఆలయంలో కరోనా  వైరస్ మంచి ప్రజలందరికీ విముక్తి కలగాలని ఆలయ అర్చకులు ఏకంగా నరబలి  ఇచ్చాడు. ఇక ఈ ఘటన తెలిసి ఏకంగా స్థానిక ప్రజలు అందరూ తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.  స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు  అర్చకుణ్ణి అరెస్ట్ చేసి పలు సెక్షన్ల  కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: