నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చనిపోయినట్లు మొన్నటిదాక వార్తలు రాగానే వాటిని కొట్టిపారేస్తూ ఆయన అందరికీ షాకిచ్చి ప్రభుత్వ కార్యక్రమాలో ఇటీవల పాల్గొనడం జరిగింది. ప్రజల ముందు ప్రత్యక్షమయ్యి ఒక ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ కార్యక్రమానికి హాజరై తన మరణం పై వస్తున్న పుకార్లకు తెరదించడం మనకందరికీ తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత క్రూరుడు గా నియంతగా పేరు తెచ్చుకున్న కిం జోంగ్‌ ఉన్‌ దేశంలో తనకి వ్యతిరేకంగా మాట్లాడిన తప్పుడుగా ప్రచారం చేసినా కనీసం కేసు నమోదు చేయకుండా డైరెక్ట్ గా ఉరి తీస్తూ ఉంటాడట. ఈ విధంగా ఇప్పటి వరకు ఉత్తర కొరియా దేశంలో కొన్ని వందలాది మందిని కిం జోంగ్‌ ఉన్‌ చంపించాడు. కాగా తాజాగా తనలో ఉన్న క్రూరమైన స్వభావాన్ని బయట పెడుతూ భార్యాభర్తలకు అతి దారుణంగా స్పాట్ లోనే, ఓ విషయంలో ఆరోపణలు వచ్చిన వెంటనే దేశద్రోహం కేసులో ఉరి తీయించాడు.

 

ప్రావిన్స్ కు చెందిన ఓ మహిళ తన సోదరుడు సౌత్ కొరియా లో ఉండటంతో అక్కడికి వెళ్ళటానికి ప్రయత్నాలు చేసింది. తన సోదరుడి కొడుకుని అతని వద్దకు తీసుకు వెళ్లాలని భావించింది. దానికోసం రహస్యంగా చైనా నుండి దక్షిణకొరియా వెళ్లేందుకు ఆ దంపతులు ప్లాన్ చేశారు. ఇలాంటి సమయంలో రహస్యంగా బోర్డర్ దాటుతున్న సమయంలో ఉత్తర కొరియా బోర్డర్ సెక్యూరిటీకి ఆ దంపతులు చిక్కారు. ఆ బాలుడి తో పాటు దంపతులను ఆర్మీ అరెస్టు చేసింది.

 

ఆ దంపతులు సోదరుడు వద్దకు వెళ్తున్నాము అని ఎంత చెప్పినా గాని బోర్డర్ సెక్యూరిటీ ఆఫీసర్లు వినలేదు కనికరించలేదు. దీంతో విషయం కిం జోంగ్‌ ఉన్‌ వద్దకు వెళ్లడంతో ఏమాత్రం కనికరం లేకుండా వెంటనే ఆ దంపతులను ఉరి వేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు పంపడంతో స్పాట్ లోనే దంపతులను ఉరి వేశారు. కాగా ఆ బాలుడిని లేబర్ క్యాంప్ కి తరలించారట . దీంతో ఈ వార్త ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో రావడంతో మరి ఇంత క్రూరత్వమా అని కిమ్ పై జనాలు మండిపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: