అసలు కొందరు వ్యక్తులు అసలు భూమి మీద ఎందుకు బతికి ఉంటారో వారికి తెలియకుండా బతికేస్తుంటారు. గత కొద్ది రోజుల నుంచి భారతదేశంలో మళ్లీ అఘాయిత్యాలు ఎక్కువ అయిపోతున్నాయి. దేశంలో రోజుకి ఏదో ఒక మూలన హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు ఇలా రోజు రోజుకి క్రైమ్ రేట్ దేశంలో మళ్లీ పెరుగుతూ వెళుతుంది. 


అయితే ఇక అసలు విషయానికి వస్తే... తమిళనాడులో మానవజాతి సిగ్గుపడేలా ఒక దారుణ ఘటన జరిగింది. కేవలం రెండు నెలల పాప, తన సొంత కూతురు అయి ఉండి కూడా చూడకుండా అత్యాచారానికి ప్రయత్నించాడు ఒక కీచక తండ్రి. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లాలో చోటు చేసుకుంది. కేవలం రెండు నెలల పాప పై లైంగిక వేధింపులకు ప్రయత్నించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలియజేశారు. ఇక ఈ కేసులో పూర్తి వివరాల్లోకి వెళితే... ఈరోడ్ జిల్లాలోని భవాని తాలూకా మాధుర్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. 


ఒక పక్క చిన్నారి తల్లి ఇతర పనుల్లో ఉన్నప్పుడు, పాప నిద్రిస్తున్న సమయంలో ఆ కీచక తండ్రి పాపను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించాడు. పాప ఏడుపు లో వినబడుతూనే తల్లి అతను పాప ను అత్యాచారం చేసేందుకు ప్రయత్నించినట్లు ఆవిడ గమనించింది. ఇక అనంతరం పాపను తల్లి ఆస్పత్రికి తరలించి వైద్యులకు జరిగిన సంఘటన వివరించంది. ఆ తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్ లో తన భర్తపై ఫిర్యాదు అందజేసింది సదరు మహిళ. దీనితో వెంటనే అదుపులోకి తీసుకొని వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సదరు వ్యక్తి పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పదిహేను రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అతనిని పంపించారు పోలీసులు. నిజంగా ఇలాంటి వాళ్ళ వల్ల దేశంలో చాలా మంది అమ్మాయిలకు భద్రత లేకుండా పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: