నారా వారి పొలిటికల్ హీరో లోకేష్ బాబు ఇప్పుడు అందరికీ స్పెషల్ ఎట్రాక్షన్ గా  కనిపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టిడిపి మహానాడులో నాయకుల మధ్య చర్చ మొత్తం లోకేష్ కు సంబంధించిందే. అసలు చినబాబు ఈ భారీ ఊబకాయం నుంచి ఎలా బయట పడ్డాడా ? ఆకస్మాత్తుగా స్లిమ్ గా ఎలా అయ్యాడా అనే విషయం ఇప్పుడు ఎవరికీ అంతుపట్టడం లేదు. దీంతో మహానాడులో పార్టీకి సంబంధించిన విషయాలను పక్కనపెట్టి లోకేష్ కు సంబంధించిన ఈ వ్యవహారాన్ని తెలుసుకునే పనిలో తెలుగు తమ్ముళ్లు నిమగ్నమయ్యారు. ఒకరేమో ఇంజక్షన్లు తీసుకుని బరువు తగ్గడని, మరికొందరు కాదు కాదు కొవ్వు తగ్గించాడు అంతే అని, మరికొందరు లైపో చికిత్స తీసుకున్నాడని, ఇలా ఎవరికి తోచిన విధంగా వారు మహానాడులో చర్చించుకున్నారు. కానీ అసలు విషయం మాత్రం వేరే ఉంది. 

IHG


ఈ లాక్ డౌన్ సమయంలో పూర్తిగా అన్నం, పప్పు వంటి పదార్థాల జోలికి వెళ్లకుండా, కేవలం డ్రైఫ్రూట్స్, తాజా పళ్ళు వాకింగ్ వంటివి చేసి బాగా సన్న పడినట్లు చంద్రబాబుకు అత్యంత సన్నిహితమైన నాయకులు మధ్య జరుగుతున్న చర్చ. వాస్తవంగా లాక్ డౌన్ సమయంలో చిన్నబాబు మరింతగా ఒళ్ళు పెంచేస్తారని అందరూ ఊహించారు. సోషల్ మీడియాలోనూ వ్యంగ్యంగా పోస్టింగ్ లు ట్రోల్ అయ్యాయి. కానీ చినబాబు సడన్ ఎంట్రీ చూశాక అందరి నోళ్ళు మూతపడ్డాయి. అసలు ఇలా ఎలా సాధ్యమైంది అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. లాక్‌డౌన్‌ కు ముందుగానే హైదరాబాదులో చంద్రబాబు, లోకేష్ బందీ అయిపోయారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో లాక్ డౌన్ పొడిగించుకుంటూ రావడం వల్ల రెండు నెలలు ఇంటికే పరిమితం అయిపోయారు. 

 

ఈ సమయంలో చంద్రబాబు పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తుండగా లోకేష్ మాత్రం తగ్గించే పనులు పూర్తిగా నిమగ్నమైపోయారు. దీనిలో భాగంగానే ఒకసారి రోడ్లపైకి సైకిల్ వేసుకు వచ్చి మూతికి మాస్క్ కట్టుకో పోవడంతో అభాసు పాలయ్యారు. అప్పుడు కాస్త లావు గానే కనిపించినా ఇప్పుడు మాత్రం స్లిమ్ అవ్వడంతో టిడిపి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. చినబాబు ఎప్పుడూ ఇలా స్లిమ్ గానే ఉండాలంటూ తెలుగు తమ్ముళ్లు అంతా కోరుకుంటున్నారు. మరి లోకేష్ బాబు వారి కోరిక తీరుస్తారా లేక ఇది మూడు నాలుగు ముచ్చటగానే ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: