ఈ మధ్య కాలంలో మెగా బ్రదర్ నాగబాబు తనదైన  కామెంట్లకు జోరు పెంచిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా సోషల్ మీడియాలో హాట్టాపిక్గా కొనసాగుతూనే ఉన్నారు మెగా బ్రదర్ జనసేన నేత నాగబాబు. ప్రతి విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారిపోతున్నారు. కరోనా  వైరస్ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో దేవుళ్ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం... ఆ తర్వాత మొన్నటికి మొన్న గాంధీని చంపిన గాడ్సే ని గొప్ప దేశభక్తుడు అంటూ పొగడడం... ఇక తాజాగా టాలీవుడ్ సమావేశం ముగిసిన తర్వాత... బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా దానికి కౌంటర్ ఇస్తూ నాగబాబు వ్యాఖ్యలు చేయడం ఇలా ఎన్నో విషయాల పై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు మెగా బ్రదర్ నాగబాబు. 

 


 అటు ఏపీ రాజకీయాల్లో కూడా తనదైన కౌంటర్లు ఇస్తూ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటారు అనే విషయం తెలిసిందే. జనసేన పార్టీకి సంబంధించి ఎవరైనా విమర్శలు చేశారు అంటే వారికి తన స్టైల్ లో  కౌంటర్ ఇస్తూ ఉంటారు మెగా బ్రదర్ నాగబాబు. ఇక తాజాగా ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కు అంశం గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నాగబాబు . తాజాగా ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఏపీ ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి నియమించాలని  కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు ఈ తీర్పు ఇవ్వడం పై ప్రతిపక్ష నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 


 హైకోర్టు తీర్పు... ప్రజల్లో ఎంతగానో నమ్మకాన్ని నింపింది అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అదే సమయంలో జగన్ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. జగన్ సర్కార్ ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హితవు పలుకుతున్నారు. అయితే తాజాగా ఇదే విషయంపై జనసేన నేత మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ... భారత న్యాయ వ్యవస్థకు హాట్సాఫ్... న్యాయవ్యవస్థ  తీర్పుతో ప్రజల్లో ఎంతగానో విశ్వాసం నిండింది ... అన్యాయంపై పోరాడే బలాన్ని ఇచ్చింది అంటూ మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కాగా ప్రస్తుతం నాగబాబు పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: