ఈ మధ్యకాలంలో చిన్న చిన్న కారణాలతో నే జరుగుతున్న హత్యలు ఎక్కువైపోతున్నాయి. బంధాలకు బంధుత్వాలకు విలువ ఇవ్వడం లేదు ఎవరు. క్షణికావేశంలో  నిర్ణయాలు తీసుకొని దారుణాలకు పాల్పడుతున్నారు. బంధుప్రీతి మరిచి ఏకంగా ప్రాణాలను తీసేస్తున్నారు.ఇలాంటి ఘటనలు ఈ రోజుల్లో చాలా ఎక్కువవుతున్నాయి . తాజాగా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. భార్యతో గొడవ పడి ఓ వ్యక్తి ఆరు బయట పడుకున్నాడు. కానీ పొద్దున లేచి చూసేసరికి భర్త శవమై కనిపించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అసలేం జరిగింది ఉంటుంది అనేది మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు...పోలీసులకు సమాచారం అందించారు. 

 


 ఈ ఘటన కడప పట్టణ శివారులోని భగత్ సింగ్ నగర్ లో వెలుగులోకి వచ్చింది. ఆరుబయట పడుకున్న ఓ వ్యక్తి రాత్రికి రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. రాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు దాడి చేసి చంపారు . ఇక ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు... మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు  అయితే మృతుని బంధువులు హత్య చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. భరత్ సింగ్ నగర్ కు చెందిన నాగేష్ లక్ష్మీదేవి లకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 15 ఏళ్ల కూతురు కూడా ఉంది. ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొద్ది రోజులుగా మద్యానికి బానిసైన నాగేష్ కూతురిని తరచూ వేధించేవాడు. 

 


 దీంతో భార్యాభర్తలిద్దరూ మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలోనే బుదవారం రాత్రి నాగేశ్  ఇంట్లో గొడవ పడి మంచం వేసుకుని బయట పడుకున్నాడు. అర్థరాత్రి సుమారు 12 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు నాగేష్ ను మంచం కోళ్ళతో తలపై ఛాతిపై ముఖం పై తీవ్రంగా కొట్టారు. ఇక ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నాగేష్ తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఉదయాన్నే లేచి చూసేసరికి శవమై కనిపించాడు. విషయం తెలుసుకున్న డిఎస్పి సూర్యనారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.. ఇక నాగేశ్  హత్య కేసులో అనుమానిత బంధువులను అరెస్టు చేసి విచారిస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: