ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. చైనాలో మొద‌లైన ఈ మ‌హ‌మ్మారి ప్రపంచంలోని 213 దేశాలకు కరోనా మహమ్మారి విస్తరించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 59 లక్షల 4 వేల 397 మంది ఈ వైరస్‌ భారిన పడ్డారు. కోవిడ్‌-19 కారణంగా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల 61 వేల 998 మంది వ్యక్తులు చనిపోయారు. వ్యాధి నుంచి 25 లక్షల 79 వేల 534 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. కాగా, భారత్‌లో లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది.  కోవిడ్-19 కేసులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ తొమ్మిదో స్థానంలో ఉంది. 

 

ప్ర‌పంచ‌వ్యాప్త గ‌ణాంకాలు చూస్తే, మొత్తం వైర‌స్ బారిన ప‌డిన వారిలోయాక్టివ్‌ కేసుల సంఖ్య 29 లక్షల 62 వేల 865.  కరోనా వైరస్‌ కారణంగా అగ్రరాజ్యం అమెరికా అత్యంత ప్రభావానికి గురైతుంది. కోవిడ్‌-19తో యూఎస్‌ఏ లో ఇప్పటి వరకు 1,03,330 మంది చనిపోయారు. కోవిడ్‌-19 కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన వివిధ దేశాల వివరాలిలా ఉన్నాయి. బ్రెజిల్‌-26,764, రష్యా-4,142, స్పెయిన్‌-27,119, యూకే-37,837, ఇటలీ-33,142, ఫ్రాన్స్‌-28,662, జర్మనీ-8,570, టర్కీ-4,461, ఇరాన్‌-7,627, పెరూ-4,099, కెనడా-6,877, చైనా-4,634, మెక్సికో-9,044, పాకిస్థాన్‌-1,260, బెల్జియం-9,388, నెదర్లాండ్స్‌-5,903, ఈక్వెడార్‌-3,313, స్వీడన్‌-4,266, పోర్చుగల్‌-1,369, స్విర్జర్లాండ్-1,919, ఐర్లాండ్‌-1,639, ఇండోనేషియా-1,496, పోలాండ్‌-1,038, రోమేనియాలో 1,235 మంది  క‌న్నుమూశారు.

 

 

ఇదిలాఉండ‌గా, భారత్‌ ఇప్పటికే కరోనా మరణాలు, కేసుల సంఖ్యలో చైనాను దాటేసింది. శుక్రవారం వరకు భారత్‌లో 1,60,000 మందికి కరోనా సోకగా మహమ్మారి కారణంగా 4,600 మంది చనిపోయారు. మే 13 నుంచి ప్రతిరోజూ దేశంలో 100కు పైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ, గుజరాత్‌ రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.  మే 28న ఒకే రోజు 194 మంది కోవిడ్‌-19 వల్ల చనిపోయారు. మే 5 తర్వాత ఒక్క రోజే ఇంతస్థాయిలో మరణాలు నమోదవడం  గమనార్హం. భారత్‌లో మరణాల రేటు 2.9శాతంగా ఉన్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా  7,466 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1.65 లక్షలు దాటింది. ఇవాళ్టి వరకు 4,706 మంది కోవిడ్‌-19 వల్ల చనిపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: