కరోనా వైరస్ వచ్చిన నాటి నుండి మూఢనమ్మకాలు సృష్టించే వాళ్ళు తెగ రెచ్చిపోతున్నారు. కరోనా వైరస్ ని క్యాష్ చేసుకోవడానికి అమాయకులను మభ్యపెడుతూ లేనిపోని సూచనలు చేస్తున్నారు. అదే విధంగా సరికొత్త వైద్యం అంటూ కరోనావైరస్ నుండి తప్పించుకోవచ్చు అంటూ అప్పట్లో ఇంటికి వేపాకులు పెట్టుకోండి. ఆవు పేడలో స్నానం చేయండి అంటూ కొంతమంది లేనిపోని వార్తలు సృష్టించి అమాయకులకు అంటగట్టి దారుణాలు ఒడిగట్టారు.

IHG

తాజాగా ఇదే విధంగా కరోనా వైరస్ ఈ దేశంలో నుండి పోవాలంటే దేవతలు ఓ పూజారి కలలోకి వచ్చి నరబలి ఇవ్వమన్నాడు అని చెప్పారట వెంటనే ఆ పూజారి వారు నివసిస్తున్న గ్రామంలో ఒక వ్యక్తి తలకాయ ని గొడ్డలితో నరికి చంపడం జరిగింది. ఆ తరువాత వెంటనే పోలీసులకు లొంగిపోవడం జరిగింది. ఈ ఘటన ఒడిషా రాష్ట్రంలో కటక్ జిల్లాలోని బందహుడా గ్రామంలో జరిగింది. స్థానిక గుడిలోని పూజారి సన్సారీ ఓజా.. అదే గ్రామానికి చెందిన సరోజ్ కుమార్ ప్రధాన్ ను బుధావారం రాత్రి గొడ్డలితో తల నరికి హతమార్చాడు.

IHG': 72-Year-Old <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ODISHA' target='_blank' title='odisha-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>odisha</a> Priest Dreams Human Sacrifice ...

గురువారం ఉదయం నర్సింగాపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తాను హత్య చేసినట్టు ఒప్పుకుని లొంగిపోయాడు. పోలీసులు పూజారిపై కేసు నమోదు చేశారు. మరోపక్క అదే గ్రామానికి చెందిన ప్రజలు చనిపోయిన వ్యక్తికి మరియు పూజారికి ఆస్తి గొడవలు ఉన్నాయి అని అంటున్నారట. కానీ పోలీసుల విచారణ లో మాత్రం పూజారి మానసిక పరిస్థితి బాగోలేదు అని మత్తులో హత్య చేసినట్లు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: