బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు సుహారిక మొన్న అకస్మాత్తుగా మరణించిన సంగతి తెలిసిందే. ఆమె వయస్సు కేవలం 32 సంవత్సరాలు మాత్రమే. అందులోనూ ఆమెను కన్నా కుమారుడు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె హఠాన్మరణం వెనుక ఏం జరిగిందన్న కోణంలో అనేక కథనాలు వచ్చాయి.

 

 

అయితే.. కన్నా లక్ష్మీనారాయణ కోడలు సుహారిక ఎక్కువ సేపు డాన్స్ చేయడం వల్లే చనిపోయినట్టు తెలుస్తోంది. ఆమె డ్యాన్స్ బాగా చేసి అలిసి పోయి గుండె పోటుకు గురై ఉంటారని వైద్యులు అభిప్రాయపడినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ అసలేం జరిగిందంటే.. ఆమె కొండాపూర్ లో ఒక ఫ్రెండ్ ఇంటి వద్ద జరిగిన పార్టీకి హాజరైంది. ఆ పార్టీలో ఆమె చాలా సేపు డాన్స్ చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారట.

 

 

బాగా డాన్స్ చేసిన తర్వాత ఆమె హఠాత్తుగా కింద పడిపోయారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత శవపరీక్ష చేసిన డాక్టర్లు కూడా ఇదే విషయం ధ్రువీకరించారట. ఆమె బాగా బాగా జోరుగా అలుపు లేకుండా వ్యాయామం చేసినట్టగా ఉందని శవపరీక్షలో వైద్యులు చెప్పినట్టు తెలుస్తోంది. ఆమె శరీరంపై వేరే గాయాలు లేవని.. శరీరంలోపల కూడా ఎలాంటి గాయాలు లేవని పోస్టుమార్టం రిపోర్టు చెబుతోందట.

 

 

అందువల్ల విపరీతంగా డాన్స్ చేయడమే ఆమె ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టిందని వైద్యులు భావిస్తున్నారు. శవ పరీక్ష తర్వాత పోలీసులు భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు అందచేశారు. అయితే ఆమె చనిపోయిన తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇలా విపరీతంగా డాన్స్ చేసినా అది ప్రాణాలు తీసేంత వరకూ వెళ్తుందా అని ఈ విషయం తెలిసినవాళ్లు షాకవుతున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: