ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్ని జంటలు ఉన్నప్పటికీ మహేష్ బాబు నమ్రత జంట మాత్రం తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడు ఎవర్గ్రీన్ గా  కనిపిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే వీరి వివాహం జరిగి ఇప్పటికి ఎన్నో గడిచిపోయింది . మహేష్ బాబు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే నమ్రతతో ప్రేమ వ్యవహారం నడిపి అప్పుడే పెళ్లి చేసుకున్నారు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వీరిద్దరి మధ్య ఎక్కడ వివాదాలు తలెత్తిన దాఖలాలు  మాత్రం లేవు. వీరిద్దరి మధ్య ఉండే అన్ని అనుబంధం అన్యోన్యత  ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు ముచ్చటేస్తూ  ఉంటుంది. అయితే వీరిద్దరూ సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే. వంశీ  సినిమాలోనే  వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది . అప్పుడప్పుడే మహేష్ బాబు  చిత్రపరిశ్రమకు పరిచయం అవుతున్నాడు. అప్పటికే మహేష్ బాబు హీరోగా రాజకుమారుడు యువరాజు సినిమాలు తీయగా అవి మంచి విజయాన్ని అందుకున్నాయి. 

 


 ఇక మహేష్ బాబు నమ్రత శిరోద్కర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన వంశీ సినిమా స్వయంగా తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పద్మాలయా స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు. నమ్రతా శిరోద్కర్ అప్పటికే మాజీ మిస్ ఇండియా గా ఉంది. ఇక వంశీ సినిమాలో మహేష్ నమ్రత మధ్య ఆస్ట్రేలియాలో కొన్ని  ప్రేమకథ సన్నివేశాలను  చిత్రీకరించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్యన ప్రేమ చిగురించింది. ఆ తర్వాత కొన్నాళ్లపాటు ప్రేమలో మునిగితేలిన ఇద్దరు... పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే వంశీ సినిమాలో  సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒక స్పెషల్ రోల్ లో కనిపిస్తాడు . 

 


 ఇలా కొడుకుతో కలిసి నటించి కృష్ణ ఏకంగా తన ఇంటికి కోడలిగా తెచ్చుకున్నాడు అని అంటూ ఉంటారు తెలుగు చిత్ర పరిశ్రమలో. ఇక పెళ్లి తర్వాత వీరిద్దరి మధ్య భార్యాభర్తల బంధం  ఎంత అన్యోన్యంగా సాగింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి జంటను  చూసినప్పుడల్లా ప్రేక్షకులందరూ మురిసిపోతూ ఉంటారు. ముచ్చటగా వీరిద్దరి మధ్య అనుబంధం ఉంటుంది.వీరి  ప్రేమకు గుర్తుగా సితార గౌతం లు  జన్మించారు.వీరికి కూడా  ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ వైపు సితార క్యూట్ ఫొటోస్ తో అదరగొడితే  మరోవైపు తన అందం తో  అందరి మనసులను దోచుకున్నారు గౌతమ్ .

మరింత సమాచారం తెలుసుకోండి: