మగవాళ్ళ కన్నా కూడా ఎక్కువగా ఆడవాళ్ళు క్రైమ్ ను చేస్తున్నారు.. ఇంక చెప్పాలంటే మొగుడు వుండగానే మరొకరి తో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు.. ఇప్పటి చాలా మంది మరో మగాడి మోజులో పడి భర్తను ఘాడి తప్పిచిన ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి.. ఇలా చెప్పుకుంటూ పొతే చాలానే ఘటనలు జరిగి మనుషుల మధ్య బందవ్యాలను కూడా కోల్పోయేలా చేస్తున్నాయి.. 

 

 


వివరాల్లోకి వెళితే.. ఏడో తరగతిలోనే హద్దులు దాటిన బాలిక.. గర్భం వస్తుందేమోనని..పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుని భర్తతో కలసి జీవించలేకపోయింది. పెళ్లయ్యాక మరో వ్యక్తిని ప్రేమించింది. ఇష్టపడిన వ్యక్తినే మరోమారు పెళ్లి చేసుకుంది. చివరికి ఉరి వేసుకుని అర్ధాంతరంగా తనువు చాలించింది. భర్తని వదిలేసి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమెకు వేధింపులు ఎదురవడంతో బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన తెలంగాణలోని జగిత్యాలజిల్లాలో చోటుచేసుకుంది.

 

 

 


సారంగాపూర్ మండలంలోని నాగునూర్ గ్రామానికి చెందిన నర్మద(22)కు పెద్దలు వివాహం జరిపించారు. భర్తతో కలసి ఉండడం ఇష్టంలేక జగిత్యాల రూరల్ మండలం తిప్పన్నపేట గ్రామానికి చెందిన నలువాల శ్రీనివాస్‌ని ప్రేమించింది. ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. కొద్దికాలం వారి కాపురం సాఫీగానే సాగింది. నెమ్మదిగా అత్తింటి వారి నుంచి వరకట్న వేధింపులు మొదలయ్యాయి.

 

 

 


కట్నం తీసుకురావాలని భర్త ,అత్తింటి వేదింపులు రోజు రోజుకు పెరుగుతూ వచ్చాయి..ఆమె నాగునూర్‌లోని పుట్టింటికి వచ్చేసింది. ఈ విషయమై పలుమార్లు పంచాయితీలు కూడా జరిగాయి. అయినా అత్తింటి వారిలో మార్పు రాకపోవడంతో ఆమె పుట్టింటి వద్దే ఉంటోంది. భార్య కోసం నాగునూర్ వచ్చిన భర్త శ్రీనివాస్‌తో ఘర్షణ జరిగింది.అంతేకాకుండా భర్త నోటికి వచ్చినట్లు మాట్లాడటంతో ఆమె మనస్తాపానికి గురయ్యింది.. దాంతో ఇంట్లో ఉన్న దూలానికి ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: