తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ప్రజలకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.. దేశ ప్రగతిలో ఈ రాష్ట్రం ముఖ్య పాత్ర పోషిస్తోంది. తెలంగాణ ప్రజల అభ్యున్నతి మరియు శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నానని మోదీ తెలుగు తోపాటు ఇంగ్లీష్ లో ట్వీట్ చేశారు అలాగే ఆంధ్రా ప్రజలకు కూడా మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. కృషి మరియు పట్టుదల, ఈ సంస్కృతికి మారు పేరు. ఈ రాష్ట్ర ప్రజల అన్ని ప్రయత్నాలూ విజయవంతం కావాలని ఆశిస్తున్నానని మోదీ ట్వీట్ చేశారు. 
మరోవైపు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా  తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా  తెలంగాణ ప్రజలకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇక రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ,గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: