ప్రేమ ఎంతో మధురమైనది.. జీవితంలో ఎన్నో తీపి జ్ఞాపకాలను ఇస్తుంది. కానీ నేటి తరంలో ప్రేమ మాత్రం ఎంతో మంది ప్రాణాలను తీస్తుంది. అప్పుడప్పుడే ఎదుగుతున్న అభం శుభం తెలియని చిన్నారులు లతోపాటు.. ఎంతో మంది యువతీ యువకుల ప్రాణాలు సైతం బలి తీసుకుంటుంది ప్రేమ. ప్రేమించిన వ్యక్తి దూరమయ్యాడనో లేదా తమ పెళ్లికి ఇంట్లో ఒప్పుకోలేదనో వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకుని తనువు చాలిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువైపోతున్నది. . ఇలా రోజురోజుకు ప్రేమ పేరుతో ఆత్మహత్యలు హత్యలు ఎక్కువైపోతున్నాయి. తాజాగా ఇలాంటి ఒక ఘటన జరిగింది.
ప్రేమ కు అండగా నిలిచిన స్నేహితులను యువతి లేదా యువకుడి తల్లిదండ్రులు అతి దారుణంగా హత్యలు చేయడం మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. తాజాగా ఇక్కడ అలాంటి ఘటన జరిగింది. ప్రేమ కు అండగా నిలిచాడు అన్న కారణంతో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం గూబాగుండంమెట్ట వద్ద దారుణ ఘటన జరిగింది. ఓ యువ జంట ప్రేమించుకున్నారు. కానీ వారి ప్రేమకు మాత్రం పెద్దలు నో చెబుతున్నారు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ అనే యువకుడు ప్రేమ జంట కు మద్దతుగా నిలిచాడు. ఆ ఇద్దరి ప్రేమకు ఆ యువకుడు సహకరిస్తూ ఉన్నాడు అనే విషయం యువతి కుటుంబ సభ్యులు వరకు వెళ్ళింది.
దీంతో ఆ యువకుడు పై బాగా కోపం పెంచుకున్నాడు యువతి కుటుంబ సభ్యులు. ఇక ఓ రోజు పథకం ప్రకారం ప్రవీణ్ కుమార్ పై మూకుమ్మడిగా దాడికి దిగారు యువత తరపున బంధువులు. శఈ దాడిలో అతనికి తీవ్రగాయాలయ్యాయి. ఇక స్థానికులు ప్రవీణ్ కుమార్ ను ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ప్రవీణ్ కుమార్ ప్రాణాలు విడిచాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.