హిందూపురం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య బాబు ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు పై చేసిన వ్యాఖ్యలు అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ సంచలనం రేపిన విషయం అందరికీ తెలిసిందే. లాక్ డౌన్ వల్ల సినిమా ఇండస్ట్రీలో సినిమా షూటింగ్ లు ఆగిపోవటంతో చిరంజీవి మరియు నాగార్జున ఇంకా ఇండస్ట్రీకి చెందిన పెద్దలు తెలంగాణ మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలవడం ఈ విషయంపై తనకి ఇండస్ట్రీ నుండి పిలుపు రాలేదని వాళ్ళ పై విమర్శలు చేశారు. ఈ సమావేశానికి మీకు ఇండస్ట్రీ నుండి పిలుపు రాలేదని మీడియా విలేకరి ప్రశ్నించగా బాలయ్య బాబు మాట్లాడుతూ… నన్నెవరూ పిలవలేదు ఆ వార్తలు కూడా నేను టీవీల్లో వార్తా పత్రికలలో చూసి తెలుసుకున్నాను అని అప్పట్లో ప్రతిస్పందించారు.

IHG

అంతేకాకుండా తలసాని దగ్గర సమావేశానికి వెళ్లిన ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు భూములు పంచుకుంటున్నారేమో' అని బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ విషయంపై నాగబాబు స్పందిస్తూ 'నువ్వు కింగ్ వి కాదు.. జస్ట్ ఒక హీరోవి మాత్రమే.. బాలకృష్ణ వెంటనే ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వానికి సారీ చెప్పాలి' అని డిమాండ్ చేస్తూ కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ గొడవ నందమూరి వర్సెస్ మెగా ఫ్యాన్స్ అన్నట్టుగా మారిపోయింది.

IHG

ఇదిలా ఉండగా ఇటీవల సోషల్ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు తో గొడవ గురించి యాంకర్ ప్రశ్నించగా  ప్రశ్నించగా "ఛీ ఛీ... నేనేమంటాను.. అన్నీ ఆయనే మాట్లాడుతున్నాడు కదా. నేను అస్సలు స్పందించను. ఇవాళ ఇండస్ట్రీ మొత్తం నాకు సపోర్ట్ గా నిలుస్తోంది. అలాంటప్పుడు నేనెందుకు మాట్లాడాలి?" అంటూ బాలకృష్ణ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. దీంతో నెటిజన్లు బాలయ్య బాబు ఈ విషయంలో చేసిన వ్యాఖ్యలివి ఛీఛీ అనే అంతా చీప్ వ్యవహారం ఇది కాదు బాబు… మీడియా ముందు సరిగ్గా మాట్లాడాలని కౌంటర్లు వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: