ఏపీ రాజకీయాల్లో చిత్రమైన విషయాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ ఎంపీ సొంత పార్టీకే షాకు మీద షాకులిస్తున్నారు. విపక్ష నేతలకంటే దారుణంగా మాట్లాడుతూ... పార్టీకి చేటు తెస్తున్నారు. పార్టీ అధినాయకుడికి సైతం మహా చిరాకు తెప్పిస్తున్నారు. ఇంతకీ ఆ ఎంపీ ఎవరో కనిపెట్టేశారా.. ఆయనే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఇటీవల ఈయన తరచూ జగన్ పాలనపై విమర్శలు గుప్పిస్తున్నారు.

 

 

అయితే నేరుగా జగన్ పై విమర్శలు చేయకుండా జాగ్రత్తపడుతున్నారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఇప్పటికే బీజేపీతో చాలా క్లోజ్ గా ఉంటున్న ఈ ఎంపీ.. రాష్ట్రంలో వైసీపీ ఎంపీగానూ.. ఢిల్లీలో బీజేపీ ఎంపీగానూ పేరు తెచ్చుకున్నారు. ఇటీవల తరచూ తెలుగుదేశం అనుకూల మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ... వైసీపీ పాలనపై విమర్శలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న టీటీడీ భూముల అమ్మకం నిర్ణయంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 

 

IHG

 

ఇప్పుడు తాజాగా మరోసారి పనికట్టుకుని తెలుగుదేశం అనుకూల మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ చుట్టూ కోటరి కంచె ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు రఘురామ కృష్ణంరాజు. అంతే కాదు.. రాష్ట్రంలో ఇసుక సమస్య తీవ్రంగా ఉందని.. ఈ సమస్యపై తాను ముఖ్యమంత్రి కి లేఖ రాస్తానని చెబుతున్నారు.

 

 

ఇక ఈ మాత్రం చాన్స్ దొరికితే తెలుగుదేశం మీడియా ఊరుకుంటుందా.. ఇలాంటి కామెంట్లకు విపరీతమైన ప్రాచుర్యం కల్పిస్తుంది. ఈ విషయం తెలిసి కూడా రఘురామ కృష్ణంరాజు ఇలా ప్రవర్తించడం చూస్తే ఏదో వ్యూహంతోనే ఆయన ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. మరి ఇలాంటి నేతలను జగన్ ఎలా కట్టడి చేస్తారో చూడాలి. మరి ఇదంతా రఘురామకృష్ణంరాజు కావాలనే చేస్తున్నారా.. లేక తెలుగుదేశం మీడియా ఆయన్ను వాడుకుంటుందా.. ఇంతకీ జగన్ ఈయనపై చర్య తీసుకుంటారా లేదా.. ఇప్పుడు ఇదే తేలాల్సిఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: