సోనూసూద్‌... బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మల్లో విల‌న్‌గా సుప‌రిచితుడు. కరోనా కల‌క‌లంలో ప్ర‌ముఖ స్టార్లు త‌మ వంతుగా ఇంకా చెప్పాలంటే ప‌రిమితంగానే సేవ చేయ‌గా....ప్ర‌ముఖ స్టార్లకు మించి సోనూసూద్ ఎంద‌రో వ‌ల‌స కార్మికుల‌కు సేవ చేశాడు. ప్ర‌త్యేకంగా బ‌స్సులు ఏర్పాటు చేశాడు మ‌రికొంద‌రిని విమానాల్లో వాళ్ల సొంత ఊరు చేరేందుకు స‌హ‌క‌రించాడు. అలా ఆయ‌న ‌‌ చేస్తున్న కృషికి ఎంద‌రో తాము రుణ‌ప‌డి ఉంటామ‌న్నారు. అయితే, తాజాగా ఓ షాకింగ్ వార్త‌ను సోనూ స్వీక‌రించాల్సి వ‌చ్చింది.

 

పొట్ట కూటి కోసం వ‌ల‌స వెళ్లి లాక్ డౌన్ వల్ల ఆ ప్రాంతంలో ఇరుక్కుపోయిన మ‌నీష్ అనే అతన్ని సోనూసూద్ తల్లి వద్దకు చేర్చాడు. దీంతో సోనూకు మ‌నిష్ ఫిదా అయిపోయాడు. సోనూను దేవుడిలా భావిస్తున్నాడు. దేవుడికి చేయాల్సిన పూజలు సోనుసూద్‌ ఫొటోకు చేస్తున్నాడు. ఈ విధంగా తన  అభిమానాన్ని చాటుకుంటున్నాడు.  ‘దేవుడికి చేయాల్సిన పూజలు మా దేవుడు సోనుసూద్‌కు చేస్తున్నా’ అంటూ ఓ వీడియో తీసి దాన్ని సోష‌ల్ మీడియాలో షేర్‌ చేశాడు మనీష్‌. ఈ వీడియో క్షణాల్లో వైరల్‌ అయింది. వీడియో చూసిన సోను సూద్‌ వెంటనే రిప్లై ఇచ్చాడు. ‘తమ్ముడూ నువ్వు అలా చేయవ‌ద్దు. రోజు అమ్మను నా కోసం ప్రార్థించమని చెప్పండి. అంతా బాగుంటుంది’ అని సోను సూద్‌ స్పందించాడు. 

 

జీవితంలో ఇంత కీల‌క‌మైన ప్ర‌యోజ‌నం పొందినందుకు మ‌నిష్ త‌న సంతోషాన్ని చాటుకుంటుంటున్న ఈ వీడియోకు కొంతమంది పాజిటివ్‌గా కామెంట్లు పెడుతుంటే మరికొందరేమో పాడు బుద్దితో స్పందిస్తున్నారు. జూనియర్‌ ఆర్టిస్ట్ అవ్వడానికి ఇదంతా చేస్తున్నాడేమో అంటూ త‌మ పైత్యాన్ని చాటుకుంటున్నారు. అయితే...రాజ‌కీయ నాయ‌కుల‌కే గుడులు క‌ట్టిస్తుండ‌గా...త‌న జీవితంలోని క‌ష్ట‌కాలంలో మ‌రపురాని మేలు చేసిన వ్య‌క్తికి ఆ వ‌ల‌స జీవి గుడి క‌ట్టించి పూజ చేయ‌డం త‌ప్పంటారా?  ఏదేమైనా సోనూ నిజంగా ప్ర‌జ‌ల హృద‌యాల‌ను గెలిచాడ‌నేది మాత్రం నిజం. 

మరింత సమాచారం తెలుసుకోండి: