మనుషుల్లో మానవత్వం మాయమైపోతుంది... బంధాలు అనుబంధాలకు విలువ లేకుండా పోతుంది...రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళ పై కూడా కసాయి వాళ్లలాగా  ప్రవర్తిస్తున్నారు చాలామంది. కనీస మానవత్వాన్ని మరిచి దారుణంగా హత్యలు చేస్తున్నారు. ఇక్కడ ఓ మహిళ అలాంటిదే చేసింది. ఏకంగా తన భర్త కోసం తన సొంత తమ్ముడి ని హత్య చేసేందుకు సిద్ధపడింది  అక్క. ఏకంగా కిరాయి గూండాలతో దారుణంగా దాడి చేయించింది. కానీ చివరికి కటకటాలపాలయ్యింది  సదరు మహిళ. బెంగుళూరులో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది... భర్త జైలు శిక్ష అనుభవిస్తుండగా  భర్తను బయటకు తెచ్చేందుకు ఆస్తి అమ్మాలనుకున్న మహిళకు  తమ్ముడు అడ్డుగా ఉన్నాడని భావించి చంపడానికి సిద్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న తమ్ముడు షాక్  కి గురయ్యాడు. 

 

 బెంగళూరులోని యలహంక ప్రాంతంలోని బీబీరోడ్డు లో నివాసముంటున్న సందీప్ రెడ్డి సుమలత అక్క తమ్ముళ్లు. అయితే సుమలత భర్త ఓ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే తన భర్త ను ఎలాగైనా జైలు నుంచి బయటకు తీసుకురావాలని భావించింది సుమలత. దీని కోసం డబ్బు అవసరం ఉండగా ఆస్తి అమ్మేసి డబ్బు సమకూర్చుకోవాలని తముడిపై  ఒత్తిడి తీసుకు వచ్చింది. కానీ తమ్ముడు సందీప్ రెడ్డి మాత్రం ఆస్తులు అమ్మెందుకు  అస్సలు ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలోనే సొంత తమ్ముడు అయినప్పటికీ అతని మీద పగ పెంచుకున్నది  సుమలత. భర్తను ఎలాగైనా బయటకు తీసుకురావాలని భావించింది. 

 


 దీంతో ఆస్తిని అమ్మేందుకు అడ్డు పడుతున్న తమ్ముడు అడ్డు తొలగించుకోవాలని భావించింది. తమ్ముడిని హత్య చేసేందుకు నిర్ణయించుకుంది. దీని కోసం ఏకంగా కిరాయి హంతకులను కూడా కుదుర్చుకొని తమ్ముడిని హత్య చేసేందుకు పక్కా ప్లాన్ వేసింది. ఈ క్రమంలోనే కిరాయి హంతకులు రోజు రాత్రి సందీప్ రెడ్డి పై దాడి చేశారు. ఇక కత్తులతో దాడి చేయడంతో సందీప్ రెడ్డి రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు దీంతో సందీప్ రెడ్డి మరణించాడు అని తెలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు కిరాయి హంతకులు . ఆ తర్వాత ఎలాగో ప్రాణం దక్కించుకున్న సందీప్ రెడ్డి... అక్క పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే అక్క తో సహా నలుగురు కిరాయి ముఠా సభ్యులను కూడా అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి తోశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: