సినీ ఇండస్ట్రీలో నెలకొన్న వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. రోజుకు కొత్త మలుపు తిరుగుతూ రెండు వర్గాలు టాలీవుడ్ విడిపోయింది. చిరంజీవి, బాలయ్య వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మంత్రులతో కలిసి భూములు పంచుకునేందుకు సినిమా ఇండస్ట్రీ పెద్దలు వెళ్లి కలిశారు అంటూ చిరంజీవి బృందాన్ని ఉద్దేశించి బాలయ్య వ్యాఖ్యానించడం పెద్ద దుమారం రేపింది. ఈ వివాదంలో బాలయ్యకు  అనుకూలంగా కొంతమంది, చిరంజీవికి అనుకూలంగా కొంతమంది విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తెలిసిందే. ఈ వివాదంలో ఇప్పుడు సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి వచ్చి చేరారు. ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య చిరంజీవి విషయాలపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ గురించి మాట్లాడుతూ, బాలయ్యతో తాను చాలా సినిమాలకు కలిసి పని చేశానని గుర్తు చేసుకున్నారు. 


ఈ సందర్భంగా బాలయ్య వ్యక్తిత్వం గురించి కోసం అనేక సంచలన విషయాలు బయట పెట్టారు. బాలయ్యకు కోపం కాస్త ఎక్కువే, కాకపోతే ఆ కోపానికి ఒక కారణం ఉంటుంది అంటూ ఆయన మాట్లాడారు. ఏదైనా బాలయ్య మొఖం మీద మాట్లాడతారని, ఉన్నది ఉన్నట్టుగా చెబుతారని, మేకప్ ఉన్నప్పుడు లేనప్పుడు ఒకే విధంగా స్పందిస్తారని, చాలా మంచి మనిషి అని, అవినీతి అక్రమాలు పాల్పడాలనే తత్వం కాదని, అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ తో సహా ఆయన కుటుంబ సభ్యులు ఎవరు ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదనే విషయాన్ని గుర్తు చేశారు. ఎన్టీఆర్ కొడుకులు అందరూ చాలా కష్టపడి పైకి వచ్చారని, బాలయ్య అందరిని చాలా ప్రేమగా గౌరవంగా చూసుకుంటారు అంటూ చెప్పుకొచ్చారు. 


అలాగే చిరంజీవి గురించి కూడా ఈ సందర్భంగా పోసాని చెప్పుకొచ్చారు. చిరంజీవి మంచి మనిషి అని, ఆయనతో కలిసి తాను ఖైదీ నెంబర్ 150 సినిమా చేశానని, పోసాని గుర్తుచేసుకున్నారు. ఆయన నటించిన అల్లుడా మజాకా సినిమా కథ తానే అందించానని ఆయన అందరితోనూ ఎంతో గౌరవంగా మాట్లాడతారని, నా ముందు కుర్చీ వేసుకుని కూర్చుని చాలా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడిన విషయం తాను ఇప్పటికీ మర్చిపోలేని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తంగా చూస్తే చిరంజీవి బాలయ్య ఇద్దరు మంచివారనని చెబుతూ పోసాని సర్టిఫికెట్ ఇవ్వడం ద్వారా తాను రెండు వర్గాలకు చెందిన వాడిని అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: