ఎప్పుడెప్పుడా టైం దొరికితే జగన్ ని ప్రజల ముందు అభాసుపాలు చేయాలని బాబోరు మీడియా కాచుకుని కూర్చుని ఉంటది. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక ఎక్కడా కూడా ఎటువంటి సమస్య రాష్ట్రంలో పెద్దది అవకుండా ఎక్కడికక్కడ పరిష్కారం చిన్న స్థాయిలోనే చూపుతూ పరిపాలించు కుంటూ పోతున్నారు. ఇటువంటి తరుణంలో ఇటీవల జగన్ ఢిల్లీ పర్యటన రద్దు అవటం అమిత్ షా అపాయింట్మెంట్ కూడా క్యాన్సిల్ అవటంతో ఇక బాబోరు మీడియా చెలరేగిపోయింది. జగన్ ఢిల్లీ పర్యటన రద్దు అవ్వడం వెనకాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి పార్టీల నాయకుల హస్తం ఉందని వాళ్ళు ఇక్కడ నుండి అమిత్ షా కి ఫోన్ చేసి జగన్ తో మీటింగ్ పెట్టకూడదు అని తేలపటంతో వెంటనే జగన్ మీటింగ్ రద్దయినట్లు అమిత్ షా అపాయింట్మెంట్ కూడా క్యాన్సిల్ అయినట్లు బాబోరు మీడియా తెగ ఊదర గొడుతోంది.

 

ఈ బాబోరు మీడియా వాదనలు విన్న చాలా మంది అసలు ఏపీ బీజేపీ లో అమిత్ షా గౌరవించే నాయకుడు ఒక్కరైనా ఉన్నారా బాబోరు మీడియా అత్యుత్సాహ కథనాలు తప్ప విషయం లేదని చాలామంది నవ్వుతున్నారు. అంతేకాకుండా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వ్యవహారం లో ప్రభుత్వం వ్యతిరేకంగా పోరు చేస్తున్న తరుణంలో బిజెపి నాయకులు చెప్పటంతో అమిత్ షా అపాయింట్మెంట్ రద్దు చేసుకున్నారని వార్తలు బాబోరు మీడియా తెగ ఊదరగొట్టే కథనాలు వారం రోజుల నుండి ప్రసారం చేస్తూనే ఉంది.

 

సోషల్ మీడియాలో కూడా ఈ వార్తలు రావడంతో అనేక మంది నెటిజన్లు విపరీతంగా బాబోరు మీడియా పై సెటైర్లు వేస్తున్నారు. అయితే ఇటువంటి ఫేక్ వార్తలు ఈ విషయంలో జగన్ ఇటీవల ప్రభుత్వం తరుపున సాంకేతిక సమన్వయకర్తలను నియమించటం అందరికీ తెలిసిందే. వీరి ద్వారా బాబోరు మీడియా కి సంబంధించి పూర్తి కథనాన్ని తెలుసుకుని త్వరలో దిమ్మతిరిగే షాక్ ఇవ్వనున్నట్లు సమాచారం.    

మరింత సమాచారం తెలుసుకోండి: