కేరళలో గత కొద్దీ రోజులనుండి భారీ సంఖ్య లో కేసులు నమోదవుతుండగా ఈరోజు ఏకంగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈఒక్క రోజే  రాష్ట్ర వ్యాప్తంగా 111 పాజిటివ్ కేసులు బయటపడగా అందులో 98 కేసులు విదేశాల నుండి వచ్చినవి కావడం గమనార్హం. ఈకొత్త కేసుల తో కలిపి కేరళలో మొత్తం కేసుల సంఖ్య 1699కు చేరగా అందులో 712మంది బాధితులు కోలుకోగా ఇప్పటివరకు 14 మంది మరణించారు. ప్రస్తుతం 973 కేసులు యాక్టీవ్ గా వున్నాయి. 
 
ఇక మిగితా దక్షిణాది రాష్ట్రాల రాష్ట్రాల విషయానికి వస్తే తమిళనాడులో కూడా ఈరోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్కరోజే 1438  కేసులు నమోదు కాగా 12 మంది మరణించారు. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 28694కు చేరింది. అలాగే కర్ణాటక లో కూడా రికార్డు స్థాయిలో ఈరోజు  515కేసులు నమోదు కాగా ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 138కేసులు నమోదయ్యాయి. ఓవరాల్ గా దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 230000 దాటగా  6500మరణాలు చోటుచేసుకున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: