పాకిస్తాన్ భారత్ మధ్య ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉంటుంది అనే విషయం తెలిసిందే. ప్రత్యక్షంగా జరగకపోయినప్పటికీ పాకిస్తాన్ ఎప్పటికప్పుడు భారత్ దాడి చేయడానికి పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదుల పంపిస్తూ ఉంటుంది. సమయం దొరికితే చాలు ఉగ్రవాదులు భారత్పై దాడి చేసి వినాశనం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూంటారు. భారత సైన్యాన్ని తప్పించుకుని లోపలికి చొరబడడానికి ఉగ్రవాదులు ఎత్తులు పైఎత్తులు అన్నీ ఇన్నీ కావు. ఉగ్రవాదులు ఎత్తులు పై ఎత్తులను తిప్పికొట్టడానికి సైన్యం కూడా మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇక ఈ మధ్య కాలంలో సైన్యం మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అన్న విషయం తెలిసిందే. మొన్నటివరకు భారతదేశానికి ఉగ్రవాదుల రాకను తగ్గినప్పటికీ ప్రస్తుతం మరోసారి ఉగ్రవాదులు రావడం వారిని సైన్యం మట్టు పెట్టడం లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ మధ్య కాలంలో ఉగ్రవాదులను వెంటాడి మరి మట్టుబెడుతున్న విషయం తెలిసిందే. అజిత్ దోవల్ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉగ్రవాదుల వ్యూహాలను తిప్పి కొడుతున్నారు.
అయితే అజిత్ ఒక ప్రత్యేక బృందాన్ని ఉగ్రవాదుల చొరబడే ప్రాంతాల్లోకి పంపించడంతో వారిని అడ్డుకునేందుకు వ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ముందుగా పాకిస్థాన్కు చెందిన ఒక ఉగ్రవాది ఎలాంటి ఆయుధాలు లేకుండా వచ్చి ఆ తర్వాత సొరంగాల ద్వారా అక్కడ కొన్ని ప్రాంతాలలో ఉన్న డంపుల్లోకి వెళ్లి అక్కడ ఆయుధం స్వీకరిస్తారు. ఈ ఆయుధాలను ఎప్పుడు చేర్చారు ఎలా చేర్చారు అన్నది కూడా ఎవరికీ అనుమానం రాకుండా చేస్తూ ఉంటారు. ఇలా పాకిస్తాన్ నుంచి ఎలాంటి ఆయుధం లేకుండా వచ్చి అక్కడ ఉన్న ఆయుధం డంపుల్లోకి వెళ్లి ఆయుధాలను సేకరించి ఆ తర్వాత దాడి చేయడానికి సిద్ధం అవుతారు ఉగ్రవాదులు.
అయితే ప్రస్తుతం సైన్యం సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఆయుధ డంపుల దగ్గరికి వచ్చి ఆయుధాలను సేకరించి దాడి చేసే ఉగ్రవాదులకు అసలు ఆయుధాలు లేకుండా చేయాలని భావిస్తోంది సైన్యం. ఇప్పటికే రెండు మూడు ఆయుధ డంపులను ధ్వంసం చేసింది భారత సైన్యం. జమ్ము కాశ్మీర్ లోని క్రిస్టఫర్ జిల్లాలో మరో ఉగ్రవాది స్థావరాన్ని.. గుర్తించింది. అక్కడ పెద్ద ఎత్తున ఆయుధాలతో పాటుగా మందుగుండు సామాగ్రి కూడా ఉంది.కాగా ఓవైపు లోపలికి రానివ్వకుండా ఉంచడం.. లోపలికి వస్తే మట్టుబెట్టడం.. అక్కడ వారితో సంబంధాలు ఉన్న వారిపై నిఘా పెట్టడం.. ఇక్కడ లింక్స్ ఎవరికి ఉన్నాయో వారిని కూడా క్లోజ్ చేయడం.. ఆయుద డంపులను ద్వాంసం చేయడం లాంటి 5 వ్యూహాలు ఇప్పుడు భారత సైన్యం ఫాలో అవుతుంది.